సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా కర్నూలులో రాజధాని ఏర్పాటు లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పకనే చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పథకాలను వల్లె వేస్తూ.. కొత్తదనం లేని హామీలతో సరిపెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్లో తొలి వేడుకకు కర్నూలు నగరం వేదిక కాగా.. శుక్రవారం జెండా పండుగ కనుల పండువగా సాగింది.
త్రివర్ణ పతాకావిష్కరణ అనంతరం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సుదీర్ఘ ప్రసంగంలో కర్నూలు జిల్లాపై వరాల వర్షం కురిపించారు. ఆచరణ సాధ్యం కాని హామీలపై టీడీపీ శ్రేణులే విస్తుపోయి చూడగా.. ప్రజల నుంచి కూడా పెద్దగా స్పందన లేకపోయింది. అధిక శాతం హామీలు ఇటీవల ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అందజేసిన నివేదికలోనివే కావడం గమనార్హం.
చంద్రబాబు వల్లె వేసిన వైఎస్ మానస పుత్రికలు
సాగునీటి సమస్య పరిష్కారానికి గుండ్రేవుల రిజర్వాయర్, గోరుకల్లు రిజర్వాయర్ల నిర్మాణం.
హంద్రీనీవా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలకు నీరివ్వడం.
టెక్స్టైల్, అపెరల్ పార్కు ఏర్పాటు.
ఓర్వకల్లు సమీపంలో విమానాశ్రయ నిర్మాణం.
ఈ హామీలు ఎప్పటికి అమలయ్యేనో...
కర్నూలు ప్రభుత్వాసుపత్రి స్థాయి పెంచి నిమ్స్ తరహాలో రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెంటర్గా తీర్చిదిద్దడం.
నంద్యాలలో విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయ విశ్వ విద్యాలయంగా తీర్చిదిద్దడం. దేశంలోనే సీడ్ క్యాపిటల్గా అభివృద్ధి చేయడం.
జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు.
ఖనిజ సంపద విస్తారంగా ఉన్న డోన్లో ధన్బాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ తరహా ప్రతిష్టాత్మక సంస్థను స్థాపించడం.
సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కర్నూలు జిల్లా అనుకూలంగా ఉండటంతో సాంప్రదాయేత ఇంధన వనరుల వినియోగానికి చర్యలు.
బనవాసిలో గొర్రెలు, మేకలు, ఒంగోలు గిత్తల పరిశోధన కేంద్రం ఏర్పాటు.
కేంద్రం ప్రకటించిన 100 స్మార్ట్సిటీల్లో తొలి నగరంగా కర్నూలు అభివృద్ధి.
ఓర్వకల్లు వద్దనున్న 30వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో పారిశ్రామిక నగరం ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలను కల్పించడం. మ్యానుఫ్యాక్చరింగ్, హార్డ్వేర్, ఐటీ పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు.
జొహరాపురం వద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం.
ఆలూరు వద్ద జింకల పార్కు. శ్రీశైలం, నందికొట్కూరులో అదే తరహా పార్కులు ఏర్పాటు చేసి వన్యప్రాణులను సంరక్షించడం.
శ్రీశైలం, మంత్రాలయం, యాగంటి, మహానంది తదితర పుణ్యక్షేత్రాలను అనుసంధానించి అభివృద్ధి చేయడం.
ఊరడింపు వరాలు
Published Sat, Aug 16 2014 12:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement