కారులో మంటలు: వ్యక్తి సజీవ దహనం | Sakshi
Sakshi News home page

కారులో మంటలు: వ్యక్తి సజీవ దహనం

Published Thu, Apr 20 2017 7:09 AM

Moving car catches fire, one died

విశాఖపట్టణం: జిల్లాలోని ఎస్‌ రాయవరం మండలంలో గడ్డపాడు వద్ద వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న భర్త అందులో నుంచి బయటపడగా.. చిక్కుకుపోయిన భార్య సజీవదహనమైంది. విశాఖపట్టణం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘోరం చోటు చేసుకుంది.

గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement