- నల్లధనం వెలికితీతకు వైఎస్సార్సీపీ మద్దతు
- నోట్ల రద్దుపై విపక్షాల భేటీలో పాల్గొన్న ఎంపీ మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: సరైన ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి చెప్పారు. సోమవారం సాయంత్రం పార్లమెంటులోని కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత గులాం నబీ ఆజాద్ కార్యాలయంలో జరిగిన ఏడు విపక్ష పార్టీల భేటీలో వైఎస్సార్సీపీ తరఫున మేకపాటి పాల్గొన్నారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు పడుతున్న అవస్థలు వెంటనే తొలగించాల్సిన అవసరముందని విపక్ష పార్టీలు అభిప్రాయపడినట్లు తెలిపారు.
‘నల్లధనం వెలికితీతకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు పలుకుతుందని ఈ సమావేశంలో స్పష్టం చేశాం. ప్రభుత్వం ఉన్నపలంగా సామాన్యుడికి తెచ్చిన ఇబ్బందులపైన మాత్రమే వ్యతిరేకంగా ఉన్నామని చెప్పాం. ఉన్న కరెన్సీలో 86 శాతం పెద్ద నోట్లే ఉన్నారుు. అకస్మాత్తుగా వాటిని రద్దు చేయడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. నిజాయితీగా సంపాదించుకున్నవాళ్లు కూడా డబ్బును మార్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని తీర్చేలా వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు చూపాల్సిన అవసరం ఉంది. ముందే తగిన ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది. సామాన్యులకు అసౌకర్యం లేకుండా చూడాలన్నదే వైఎస్సార్ కాంగ్రెస్ విధానం..’ అని మేకపాటి స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదాయే ప్రధాన ఎజెండా : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రధాన ఎజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాచరణ ఉంటుందని మేకపాటి తెలిపారు. రాష్ట్ర విభజన చేసినప్పుడు రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని, చట్టంలో పొందుపరిచిన ఇతర హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలనేదే పార్టీ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా కోసం పట్టుబడతామన్నారు. హామీలు అమలుచేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధాన మంత్రి మీద ఉందని స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయాలు చూపకనే ఇబ్బందులు
Published Tue, Nov 15 2016 1:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement