'బాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు' | Sakshi
Sakshi News home page

'బాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు'

Published Sat, Mar 5 2016 3:43 PM

MP Mithun Reddy press meet in Sadum

సదుం (చిత్తూరు జిల్లా) : ఏపీ నూతన రాజధానిలో తెలుగుదేశం నేతలు కొన్న భూముల డబ్బులతో రైతులు బంగారంపై తీసుకున్న రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయవచ్చని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం సదుం మండలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న జగన్ మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. త్వరలో టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. భూదందా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement