‘‘అన్నీ నేనే చేశానని చెప్పుకుంటున్న ఎంపీ మందా జగన్నాథం ఆయన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలి. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ద్వారానే నిధులు విడుదల చేస్తారనే విషయాన్ని ఆయన గుర్తెరుగాలి. ఒకే సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తనకు సహకరించాల్సిందిపోయి రాజకీయ లబ్ధికోసం అభివృద్ధి పనులకు అడ్డుతగలడం దురదృష్టకరం.’’
- ఎంపీ మందా జగన్నాథంను ఉద్దేశించి ఇటీవల అబ్రహాం వ్యాఖ్యలు
‘‘నేను చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుసు. ఐదేళ్లలో నువ్వు సాధించిందేమిటో చెప్పు. నీవు చేసిన అభివృద్ధా..ఆ మాట మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. అలంపూర్ ప్రజల దీవెనలు అందుకుంటూ ఎంపీగా కొనసాగుతున్నా. దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి ఓపెన్గా అభివృద్ధి ఎవరు చేశారో తేల్చుకుందాం. వచ్చే ఎన్నికల్లో అలంపూర్ ప్రజలు నీకు బుద్ధిచెప్పడం ఖాయం..’’
- అబ్రహాంను ఉద్దేశించి ఇటీవల ఎంపీ మందా జగన్నాథం వ్యాఖ్యలు
టిక్కెట్ల పంచాయితీ
మహబూబ్నగర్, సాక్షి ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికలకు మరో ఆరునెలల గడువు ఉన్నప్పటికీ నాయకుల మధ్య టికెట్ల పంచాయితీ అప్పుడే రాజుకుంది. తమ ప్రతిష్టతను మరింత పెంచుకునేందుకు మాటలయుద్ధానికి తెరతీశారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, నాగర్కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం మధ్య గత కొంతకాలంగా ఇదే జరుగుతోంది. ఇద్దరు కూడా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి విజయం గెలించారు. వారిద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో మొదటి నుంచి మంచి మిత్రులుగా మెలుగుతూ ఏ కార్యక్రమం నిర్వహించినా కలిసి పాల్గొనేవారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళనలో భాగంగా ఎంపీ మందా జగన్నాథం కాంగ్రెస్పార్టీని వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
దీనికితోడు తన కుమారుడు శ్రీనాథ్ను అలంపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీచేయించేందుకు భావిస్తున్నారు. ఇందుకోసం టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు నుంచి గ్రీన్సిగ్నల్ కూడా పొందినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యే అబ్రహాం తనకు పోటీగా ఎంపీ మందా జగన్నాథం కొడుకును రంగంలోకి దింపుతున్నాడనే కారణంతో కొంతకాలంగా వారిద్దరు దూరం దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇదిలాఉండగా ఎంపీ మందా జగన్నాథం మొదటి నుంచీ మంత్రి డీకే అరుణ రాజకీయ వ్యవహార శైలిని వ్యతిరేకించేవారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అబ్రహాం, ఎంపీ జగన్నాథంల మధ్య అగాథం ఏర్పడటంతో మంత్రి డీకే అరుణకు ఎమ్మెల్యే రాజకీయంగా దగ్గరవుతూ వస్తున్నాడు. ఇదే అదునుగా భావించి అలంపూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అబ్రహాంను మంత్రి అరుణ సీఎం కిరణ్కుమార్రెడ్డి వద్దకు వెంట తీసుకుని వెళ్లి నిధులు విడుదల చేయించిన సందర్భాలు ఉన్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రస్తుతం వర్గశత్రువులుగా మారారు.
ఎవరికి వారే..!
అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల, అలంపూర్ మండలాల్లో నూతనంగా నిర్మించతలపెట్టిన తహశీల్దార్ కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి ఎంపీ మందా జగన్నాథంను ఆహ్వానించకుండానే ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. అయితే అప్పట్లో ఈ వ్యవహారం కొంత గందరగోళానికి దారితీసింది. ఇటీవల జరిగిన రచ్చబండ కార్యక్రమంతో ఎంపీ, ఎమ్మెల్యేలు ఒకే వేదికపై కలవడంతో నియోజకవర్గంలో అభివృద్ధి గురించి ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడమే కాకుండా సవాల్ విసురుకున్నారు. అప్పటినుంచి రోజురోజుకు వారిద్దరి మధ్య ఆరోపణల యుద్ధం తారాస్థాయికి చేరింది. అలంపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే తీవ్ర నిర్లక్ష్యం చూపాడని ఎంపీ ఆరోపించగా, నియోజకవర్గ అభివృద్ధికి ఏనాడూ సహకరించని ఎంపీ మందా జగన్నాథం దద్దమ్మ కంటే హీనంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అబ్రహాం ధ్వజమెత్తారు. ఎంపీ కేవలం ప్రొటోకాల్ కోసం వెంపర్లాడటం తప్ప అభివృద్ధికి ఏనాడూ సహకరించలేదని కుంటబద్దలు కొట్టాడు. నియోజకవర్గంలో ఎవరికి వారు హీరోలయ్యేందుకు ఎంపీ, ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు ఇలా విమర్శలు చేసుకోవడం చూసి ప్రజలు అసహించుకుంటున్నారు.
టిక్కెట్ల పంచాయితీ
Published Fri, Nov 29 2013 3:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
సడెన్గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..
హైదరాబాద్లో కుండపోత.. వాతావరణశాఖ వార్నింగ్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @గాజువాక (విశాఖపట్నం జిల్లా)
ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement