సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వలంటీర్లకు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవినీతి రహిత పాలన అందించేందుకు చేస్తున్న కృషిని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని చైతన్య పరచాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ రోడ్డులో ఉన్న సీఎస్ఆర్ కల్యాణ మండపంలో గుర్రంపాటి దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది.
పార్లమెంట్, అసెంబ్లీ, మండలాల కో ఆర్డినేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా చీరాల నియోజకవర్గ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్, విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జి పొట్లూరి వరప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి ప్రసాదరాజు, వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల ఇన్చార్జి రాజ్ కసిరెడ్డి, పార్టీ ఎన్ఆర్ఐ కన్వీనర్ హర్షవర్ధన్, ఐటీ విభాగ ప్రధాన కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడంలో పార్టీ సోషల్ మీడియానే ముఖ్య పాత్ర పోషించిందని అన్నారు. పార్టీకి అనుబంధంగా 14 సంఘాలు ఉన్నాగానీ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్.. ముందుగా సోషల్ మీడియా వలంటీర్లతో సమావేశం కావాలని సూచించారని, ఇది వలంటీర్ల కృషి, శ్రమకు గుర్తింపు ఇచ్చినట్లేనని చెప్పారు.
సోషల్ మీడియా వలంటీర్లపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తామన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, 2024 ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసేందుకు కృషి చేయాలని వారిని కోరారు. వలంటీర్లకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గుర్రంపాటి దేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. కష్టపడే సోషల్ మీడియా వలంటీర్లకు తగిన గుర్తింపునిస్తామన్నారు.
సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
Published Mon, Aug 12 2019 4:46 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఇదేనా తెలివి.. శ్రీభరత్
రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్
అప్పన్న నిజరూప దర్శనం నేడు
ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు
చంద్రబాబు సభ వెలవెల
ఈట్ రైట్ క్యాంపస్గా హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి
సీఎం జగన్కే మా మద్దతు
హత్య కేసులో ముగ్గురికి జైలు, జరిమానా
వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి
టీడీపీ ర్యాలీలో బాణసంచాతో ఆటో దగ్ధం
తప్పక చదవండి
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement