‘చంద్రబాబు అవమానిస్తున్నారు’ | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు అవమానిస్తున్నారు’

Published Sun, Jul 23 2017 4:08 PM

‘చంద్రబాబు అవమానిస్తున్నారు’

కిర్లంపూడి: అరెస్ట్‌లు, నిర్బంధాలతో తమ జాతిని సీఎం చంద్రబాబు అవమానిస్తున్నారని కాపు సంఘం నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, ఉషాకిరణ్‌ మండిపడ్డారు. ఆదివారం వీరు విలేకరులతో మాట్లాడుతూ... హామీలు అమలు చేయమని అడిగితే అరెస్ట్‌ చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్న కాపు పెద్దలకు అరెస్ట్‌లు కనబడటం లేదా అని నిలదీశారు.

ఎన్ని ఆంక్షలు విధించిన ఈ నెల 26 నుంచి ముద్రగడ పద్మనాభం పాదయాత్ర ప్రారంభించి తీరతారని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు, కొందరు మంత్రుల మాటలు అరిగిపోయిన గ్రామ్‌ఫోన్‌ రికార్డుల్లా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈసారి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. తమపై బైండోవర్‌ కేసులు పెట్టి అడ్డుకుంటున్నారని వాపోయారు. ప్రభుత్వం తీరు మారకుంటే తామంతా రోడ్లపైకి వస్తామని ప్రకటించారు.

మరోవైపు 26 నుంచి ఛలో అమరావతి పాదయాత్రకు ముద్రగడ సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగదని ఆయన స్పష్టం చేశారు. కాపులను బీసీలను చేరుస్తామన్న హామీని చంద్రబాబు నెరవేర్చాల్సిందేనని అన్నారు.

Advertisement
Advertisement