టీఆర్‌ఎస్‌లో మున్సి‘పోల్’ ఆందోళన | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో మున్సి‘పోల్’ ఆందోళన

Published Tue, Mar 4 2014 1:46 AM

Municipal elections Concern in TRS

సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు షెడ్యూలు రానున్న ఈ సమయంలోనే అర్థాంతరంగా వచ్చిన మున్సిపల్ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కమిటీ సమావేశానికి వచ్చిన నాయకులు మున్సిపాలిటీ ఎన్నికలపై చర్చించారు. పట్టణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ బలహీనంగా ఉందని, ఈ ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలపైనా ఉంటాయని వారు భావిస్తున్నారు.
 
 దీనికి తోడు టికెట్ల వ్యవహారం, స్థానిక నేతల పనితీరు, పార్టీ విశ్వసనీయత వంటివన్నీ కలిసి టీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వస్తాయనే అంచనాతో నేతలున్నారు. గతంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు తెలంగాణ వ్యాప్తంగా ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఇవే ఫలితాలు పునరావృతమైతే సాధారణ ఎన్నికల్లోనూ నష్టం వస్తుందని, మొదటికే మోసం వస్తుందని టీఆర్‌ఎస్ నేతలు పరేషాన్‌లో ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement