ఎక్కడి చెత్త అక్కడే...! | Sakshi
Sakshi News home page

ఎక్కడి చెత్త అక్కడే...!

Published Sat, Jul 11 2015 2:36 AM

ఎక్కడి చెత్త  అక్కడే...! - Sakshi

సమ్మెలో మునిసిపల్ కార్మికులు

చిత్తూరు (అర్బన్): జిల్లా వ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు శుక్రవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. మునిసిపాలిటీల్లో పనిచేసే కార్మికుల సమస్యలను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు నిరసనగా కార్మికులు సమ్మె బాట పట్టారు. ఫలితంగా చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి మునిసిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు స్తంబించాయి.

నగరాలు, పట్టణాల్లో ఇంటింటా చెత్త సేకరణ పూర్తిగా ఆగిపోయింది. ఇక మురుగునీటి కాలువల్ని శుభ్రపరచే వాళ్లు దరిదాపుల్లో కూడా కనిపించకుండా  పోయారు. చిత్తూరు నగరంలోప్రభుత్వ మొండి ైవైఖరిని నిరసిస్తూ పారిశుద్ధ్య కార్మికులు ప్రధాన వీధుల్లో ర్యాలీ  నిర్వహించారు. ఏఐటీయూసీ నాయకులు కార్మికులకు మద్దతు ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదు ట కూర్చున్న కార్మికులు ధర్నాకు దిగారు.
 

Advertisement
Advertisement