కడప కలెక్టరేట్, న్యూస్లైన్ : తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు బుధవారం కలెక్టరేట్ దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వందలాదిగా మున్సిపల్ కార్మికులు తరలివచ్చారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎండలో బైఠాయించి నినాదాలు చేశారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.ఆంజనేయులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు 12,500 రూపాయలు జీతంగా చెల్లించాలని, వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు డబ్ల్యు. రాము మాట్లాడుతూ గత అక్టోబరులో తాము సమ్మె నోటీసు ఇవ్వగా, ఒక నెలలో సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి మహిధర్రెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మూడు నెలలైనప్పటికీ ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు వేణుగోపాల్, సీఐటీయూ నాయకులు రవి, సుబ్బరామయ్య, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
మద్దతుగా సీపీఎం ధర్నా
మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా సీపీఎం నగరశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా జరిగింది. సీపీఎం నగర కార్యదర్శి ఎన్.రవిశంకర్రెడ్డి మాట్లాడుతూ కార్మికుల జీతాల పెంపు విషయంలో ప్రభుత్వం నిర్దయగా ప్రవర్తించడం తగదన్నారు.
మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి
Published Thu, Feb 13 2014 2:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement