వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం

Published Thu, May 14 2015 5:45 AM

Murder attempt on ysrcp leader

సంగం : విద్యుత్ తీగలతో వైఎస్సార్‌సీపీ నేతను చంపాలని చూసిన సంఘటన మండలంలోని అన్నారెడ్డిపాళెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అన్నారెడ్డిపాళేనికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత శీనయ్య మంగళవారం రాత్రి తన భార్య కుసుమ, కు మార్తెలు రాధిక, మల్లికతో కలిసి ఇంటి మిద్దెపై నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో రవీంద్ర, శేఖర్‌బాబు, దయాసాగర్‌తో పాటు మరికొందరు కలిసి శీనయ్య మిద్దెపై ఉన్న విద్యుత్ తీగలకు మరికొన్ని విద్యుత్ తీగలు అనుసంధానం చేశారు.

వాటితో మస్తానయ్యను చంపాలని చూ శారు. విద్యుత్ తీగలు తగలడంతో ఉలిక్కి ప డిన శీనయ్య నిద్ర లేచేలోగా వారు అక్కడి నుం చి పరారయ్యారు. శీనయ్యకు గాయాలయ్యా యి. శీనయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనివాసవిజయ్‌కుమార్ కేసు నమోదు చేశారు. నింది తులను అదుపులోకి తీసుకున్నారు. శీనయ్య ఇంటిని పరిశీలించి, జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు.

 నిందితులపై ఇప్పటికే కేసు
 శీనయ్యపై దాడి చేసిన కేసులో గతంలోనూ  రవీంద్ర, శేఖర్‌బాబు, దయాసాగర్‌పై కేసు నమోదైంది. శీనయ్యను ఉద్దేశపూర్వకంగా దాడి చేసి గాయపరిచారు. అది మరువక ముందే మళ్లీ శీనయ్యను చంపాలని ప్రయత్నించారు. స్థానిక టీడీపీ నేతల అండతో హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement