‘ఐదేళ్ల పాలనలో మీరు చేసిందేమిటి’ | Sakshi
Sakshi News home page

‘ఐదేళ్ల పాలనలో మీరు చేసిందేమిటి’

Published Tue, Mar 26 2019 4:25 PM

MVS Nagireddy Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్లలో చేసిందేమిటని వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్‌వీఎస్‌ నాగిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు గత 9ఏళ్లలో ఏ రోజైనా ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టారా అని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ హయాంలో మొదలుపెట్టిన 54 ప్రాజెక్ట్స్‌లో ఎన్ని పూర్తి చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ చంద్రబాబును విమర్శించారు. ఈ ఐదేళ్లపాలనలో మీరుచేసిందేమిటని.. రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్‌ అయినా పూర్తి చేశారా అంటూ మండిపడ్డారు. రాయలసీమకు నీళ్లు ఇస్తున్నామంటూ హడావిడి చేస్తున్న బాబు.. అధికారికంగా ఎన్ని ఇచ్చారో చెప్పగలరా అంటూ సవాల్‌ విసిరారు.

Advertisement
Advertisement