'నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు' | Sakshi
Sakshi News home page

'నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు'

Published Thu, Sep 25 2014 3:28 PM

మీడియాతో మాట్లాడుతున్న ఇంద్రావతి - Sakshi

తిరుపతి: తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని, అన్యాయంగా శిక్ష విధించారని, అలిపిరి ఘటనలో శిక్ష పడిన రామ్మోహన్ రెడ్డి తల్లి ఇంద్రావతి వాపోయారు. సమాజంలో అరాచకాలు చూసి తట్టుకోలేకనే తన కుమారుడు రెండేళ్లపాటు నక్సలైట్లతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. పది సంవత్సరాల క్రితమే నక్సలైట్ బాట వదిలి, జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు.

రామ్మోహన్ రెడ్డి  టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లలో పనిచేసినట్లు వివరించారు.  విధించిన శిక్షపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. తన కుమారుడు ఎప్పటికైనా నిర్దోషేనని ఇంద్రావతి అన్నారు.
**

Advertisement
Advertisement