నడికుడి-శ్రీకాళహస్తికి
అరకొరగా నిధులు కేటాయింపు
కనుచూపులో కనిపించని ఆశలు
ఉదయగిరి: మెట్ట ప్రాంతాల ఆశాదీపంగా భావిస్తున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గం నిర్మాణానికి ప్రస్తుత బడ్జెట్లో నిధుల కేటాయింపు అరకొరగా ఉంది. ఐదేళ్లలో రైలు పట్టాలెక్కుతుందని ఆశపడిన మెట్ట ప్రజలకు ఈ బడ్జెట్ చూస్తే కనుచూపు మేరలో తమ ఆశలు నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. ఐదేళ్లలో ఈ మార్గం నిర్మాణం పూర్తవుతుందని ఊదరగొడుతున్న రాష్ర్ట, కేంద్ర మంత్రుల మాటలపై ఆశలు సన్నగిల్లాయి. ఈ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయింపు ఉంటుందని భావించారు. తీరా చూస్తే ఈ కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. 2019 నాటికల్లా ఈ రైల్వే మార్గం పూర్తయి ఈప్రాంత ప్రజల రవాణా సౌకర్యంతో పాటు జీవన స్థితిగతులు మెరుగుపడతాయని భావించినప్పటికీ ఆ ఆశలు నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. 309 కి.మీ నిడివిగల ఈ రైల్వే మార్గం పూర్తికావాలంటే ప్రస్తుత అంచనాల ప్రకారం రూ.2450 కోట్లు నిధులు అవసరం.
మరో ఐదేళ్లకు ఇది పూర్తవుతుందని భావిస్తే మరో రూ.500 కోట్ల వరకు అంచనాలు పెరిగే అవకాశముంది. ప్రతి బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయిస్తేనే అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. ప్రస్తుత బడ్జెట్లో ఈ మార్గకు కేవలం రూ.180 కోట్లు కేటాయించారు. ఇదేవిధంగా కేటాయింపులు కొనసాగితే 20 సంవత్సరాలకు గాని ఈ రైల్వే లైను పూర్తికాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జరిగే ఈ రైల్వే లైను నిర్మాణంకు భూసేకరణ దాదాపు పూర్తి కావస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.271 కోట్లు విడుదల చేసింది. పనులు శరవేగంగా జరగడమే తరువాయి. ఈ పరిస్థితుల్లో ఈ బడ్జెట్లో కేంద్రం రూ.200 కోట్లు పైగా కేటాయిస్తుందని భావించారు.
రాష్ట్ర వాటా కలుపుకుంటే రూ.400 కోట్లు అవుతుంది. అయితే అలా జరగలేదు. కేంద్రం రూ.90 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర వాటా కలుపుకొని రూ.180 కోట్లు అయింది. ఈ విధంగా కేటాయింపులు ఉండటంతో ఇది ఎప్పుడు పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. నిధుల కేటాయింపు అరకొరే: బసిరెడ్డి మాలకొండయ్య, నాగార్జునసాగర్ ఎడమ కాలువ సాధన కమిటీ చైర్మన్ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని మెట్ట మండలాలకు ఉపయోగకరంగా ఉండే ఈ రైల్వే మార్గం కొన్నేళ్లనుంచి కాగితాలకే పరిమితమైంది. ఈ రైల్వే లైనుకు నిధులు కేటాయింపులు భారీగా ఉంటాయని భావించారు. ఆ పరిస్థితి కనపడలేదు. వచ్చే బడ్జెట్లోనైనా నిధుల కేటాయింపు భారీగా ఉండాలి.
మెట్ట ఆశలపై నీళ్లు
Published Sat, Mar 5 2016 2:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement