కళ్యాణదుర్గం : నమ్మించి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్రెడ్డి విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులతో కొట్టించడం దారుణమన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. మహిళల శాపానికి చంద్రబాబు మసైపోతారన్నారు. అప్పట్లో తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించి..బాష్పవాయు ప్రయోగాలు చేయించారని గుర్తు చేశారు. దీంతో ఆయన్ను ప్రజలు పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మోసపు మాటలను నమ్మిన ప్రజలు తిరిగి అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు.
ఆయన తిరిగి పాత పద్ధతులనే అవలంబిస్తూ నిత్యం అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. అప్పట్లో హంద్రీ-నీవాకు రెండుసార్లు శంకుస్థాపన చేసి మభ్య పెట్టారని గుర్తు చేశారు. అదే వైఎస్ హయాంలో రూ.5,600 కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులను పూర్తి చేశారని తెలిపారు. హంద్రీ-నీవాను ఎన్టీఆర్ మానస పుత్రికగా చెబుతున్న టీడీపీ మంత్రులు మిగిలిన పనులను పూర్తి చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభిస్తే దానిని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.1,300 కోట్లు కేటాయించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వీటన్నింటి పైనా వైఎస్ జగన్ మోహన్రెడ్డి అసెంబ్లీలో నిలదీస్తే టీడీపీ ఎమ్మెల్యేలతో వ్యక్తిగత ఆరోపణలు చేయించడం తగదన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు.. పోలీసులను కూడా బెదిరిస్తున్నారని తెలిపారు. ఇక సామాన్యులకు న్యాయం, రక్షణ ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ అనిల్ పులిపాటి స్పందించి పోలీసు వ్యవస్థను సక్రమంగా నడిపించాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ సేవాదల్ నాయకులు కృష్ణకుమార్, గోళ్లసూరి, రాజమెర్లిన్, హనుమంతరాయుడు, కొల్లప్ప, బాలప్ప, గురుమూర్తి, వన్నూర్స్వామి పాల్గొన్నారు.
నమ్మించి మోసగించడం చంద్రబాబు నైజం
Published Wed, Mar 18 2015 2:20 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కడుపు మంటతోనే టీడీపీ దాడులు
కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
డల్లాస్లో తమన్ భారీ మ్యూజికల్ ఈవెంట్.. ఎప్పుడో తెలుసా?
ఎన్నికల తర్వాత.. బాబు, పవన్, పురందేశ్వరి సైలెంట్: KSR
వాట్సప్లో అదిరిపోయే ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే?
"డ్రగ్స్ పార్టీలో హేమ" నిర్ధారించిన పోలీసులు
T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
Rave Party: ఓరి దేవుడా! రేవ్ పార్టీలు ఇన్ని రకాలా..!
TS: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఫేక్ వీడియో వైరల్
కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు సెటైర్లు
తప్పక చదవండి
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్పుత్
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- సానుకూల సంకేతాలు
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement