కులాల మధ్య చిచ్చు పెడుతున్న చంద్రబాబు | Sakshi
Sakshi News home page

కులాల మధ్య చిచ్చు పెడుతున్న చంద్రబాబు

Published Tue, Mar 8 2016 3:34 AM

కులాల మధ్య చిచ్చు పెడుతున్న చంద్రబాబు

జీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున నాయక్ ధ్వజం

అనంతపురం న్యూటౌన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర కులాలకు చెందిన వారిని ఎస్టీ జాబితాలో చేరుస్తూ కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని  గిరిజన విద్యార్థి సంఘం (జీవీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున నాయక్ ధ్వజమెత్తారు. గిరిజనుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ సోమవారం పలు గిరిజన సంఘాల నాయకులు  నగరంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్‌క్లాక్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి వినతిపత్రం అందజేశారు. నాయకులు మల్లికార్జున, కేశవనాయక్ తదితరులు మాట్లాడుతూ ఓట్ల కోసం, సీట్ల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారే తప్ప ఎవరిపైనా అభిమానంతో కాదని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు రాణీనగర్ తిరుపాల్, గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు అశోక్‌నాయక్, గుజ్జుల నాగేష్, శివయ్య, పరుశురామ్‌నాయక్, చిన్న శంకర్ నాయక్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement