చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి
కోట : కేంద్ర ప్రభుత్వమంటే సీఎం చంద్రబాబునాయుడుకి ఎందుకంత భయమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ప్రశ్నించారు. బాబు తన వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. బుధవారం కోటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా, తెలంగాణా అక్రమ ప్రాజెక్టుల విషయాల్లో ప్రధాని మోదీతో, సీఎం కేసీఆర్తో బాబు రాజీ ధోరణి అవలంబిస్తున్నారన్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే రాష్ట్రానికి హోదా రాకుండా ఆయనే అడ్డుపడుతున్నారేమోననే అనుమానం కలుగుతోందన్నారు.రెండు సంవత్సరాల చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరాయన్నారు. ప్రధాని కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పసిగట్టి చంద్రబాబును పక్కన పెట్టినట్లుగా తెలుస్తోందన్నారు. హోదా సాధించడం చంద్రబాబుకు చేత కాకుంటే తప్పుకోవాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ రాష్ట్రంలో అందరినీ కలుపుకొని హోదా కోసం పోరాడుతుందన్నారు. ప్రత్యేక హోదా, తెలంగాణా అక్రమ ప్రాజెక్టులు ఈ రెండు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అందుకు వైఎస్సార్సీపీ మద్దుతు ఇస్తుందన్నారు.
వాటి వెనుక బాబు హస్తం..
బీజేపీపై తెలుగు తమ్ముళ్ల విమర్శల వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని ప్రసన్న ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేత ఆ పార్టీపై విమర్శలు చేయిస్తూ డ్రామాలాడుతున్నాడన్నారు. మినీ మహానాడులు కుమ్ములాటలకు వేదికగా మారాయన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఎస్టీలకు, మైనార్టీలకు ప్రాధాన్యత లేదన్నారు. వారంటే ఎందుకు చిన్నచూపో చెప్పాలన్నారు. ఈ సమావేశంలో కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరిచలపతి, సర్పంచ్ రాఘవయ్య, ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, ప్రసాద్, ఉపసర్పంచ్ ఇంతియాజ్ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వమంటే భయమెందుకు?
Published Thu, May 26 2016 9:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
విశాఖ రుణం తీర్చుకుంటా
● లచ్చయ్యపేటలో అలా...
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement