దేవుడి దయ ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా | Sakshi
Sakshi News home page

దేవుడి దయ ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా

Published Tue, Dec 30 2014 1:24 AM

మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతున్న లోకేశ్ - Sakshi

* టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధి కన్వీనర్ నారా లోకేశ్

మచిలీపట్నం/గుడివాడ: దేవుడి అనుగ్రహం ఉంటే 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన ని టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధి కన్వీనర్ నారా లోకేశ్ చెప్పారు. కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రం మచిలీపట్నం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్కడ ఓ ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు.

తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో ఖాళీ అయిన సీటు మీ జిల్లాలోదే కదా.. అక్క డ పోటీ చేస్తారా అని ప్రశ్నించగా ఎమ్మెల్యేలు ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబ సభ్యులనే ఎన్నికల్లో పోటీ చేయించటం ఆనవాయితీగా వస్తోందన్నారు.

ఇక వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తూ.. రుణమాఫీ సక్రమంగా జరగడం లేదని జగన్ చేసిన ధర్నాలో రైతుల కన్నా వారి పార్టీ కార్యకర్తలే అధికంగా ఉన్నారన్నారు. కాగా ప్రతీగ్రామంలో చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించిన నాడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని లోకేశ్ పేర్కొన్నారు. గుడివాడ మండలంలోని బొమ్ములూరులో ఒక గార్మెంట్స్ ఇండస్ట్రీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఎమ్మెల్యేలు ఇతర నేతలు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement