టీడీపీపై వెలమ, బీసీ సంఘాల ఆగ్రహం | Sakshi
Sakshi News home page

విశాఖపట్నం టీడీపీలో ముసలం

Published Mon, Mar 18 2019 1:14 PM

Narava Rambabu Serious On TDP - Sakshi

సాక్షి, విశాఖపట్నం : జిల్లా తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. వెలమ, బీసీలకు సముచిత స్థానం దక్కడం లేదని టీడీపీపై వెలమ, బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర వెలమ, బీసీ సంఘం అధ్యక్షుడు,  మంత్రి అయ్యన్న పాత్రుడు వియ్యంకుడు నరవ రాంబాబు టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ నేత లాలం భాస్కరరావు.. నరవ రాంబాబు ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించారు.

మంత్రి గంటా హామీ మేరకు అధిష్టానం ఎంతవరకు కట్టుబడి ఉంటుందో 24గంటల వరకు వేచి చూస్తామని వెలమ, బీసీ సంఘాలు తెలిపాయి. అధిష్టానం నీరుగార్చితే ఇద్దరు మంత్రులను వైజాగ్‌లో ఉండనీయమంటూ నరవ హెచ్చరించారు.

Advertisement
Advertisement