భిక్కనూరు, న్యూస్లైన్ : నరేంద్రమోడీ ప్రధాని అయితే మనదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రగతిగల దేశంగా రూపొందుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపల్లి విఠల్గుప్తా తలపెట్టిన నియోజకవర్గ పాదయాత్ర మంగళవారం భిక్కనూరు శ్రీ సిద్ధరామేశ్వరాలయం వద్ద ప్రారంభమైంది. ఈ యాత్రను పల్లె గంగారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. చౌరస్తా వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. పాదయాత్ర లో భాగంగా పల్లె గంగారెడ్డి పలుచోట్ల మాట్లాడారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రజలు నరేంద్రమోడీ ప్రధాని కావాలని జపం చేస్తున్నారని దేవుడు కరుణించే అవకాశం మెండుగా ఉందన్నారు. మోడీ ప్రధానమంత్రి అయితే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది అగ్రరాజ్యంగా నిలిచిపోవడం తథ్యమన్నారు.
ఇప్పటి నుంచే కాంగ్రెస్ నేతలు మోడీ ప్రధాని అయితే తాము చేసిన అక్రమాలు, అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని బెంబేలెత్తిపోతున్నారన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. గ్రామాల్లో బూత్లెవల్ నుంచి పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత కార్యకర్తైపైనే ఉందన్నారు. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీల్లో వారసత్వపు నేతలు కొనసాగుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీలో ఇప్పటి వరకు వారసత్వ రాజకీయాలు లేవన్న సంగతి ప్రజలకు కార్యకర్తలు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విఠల్గుప్తా పాదయాత్ర చేపట్టి నియోజకవర్గంలో పేద ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ముందుకురావడం అభినందనీయమన్నారు. బీజేపీ నేతలు గంగారెడ్డి, మురళీధర్గౌడ్, రంజిత్మోహన్, ప్రభాకర్యాదవ్, క్రిష్ణాగౌడ్, లింబాద్రి, తున్కివే ణు, యాచం సురేష్గుప్తా, డప్పు రవి, పుల్లూరి సతీష్, నర్సింలు, సంజీవరెడ్డి, జిల్లెల రవీందర్రెడ్డి, క్రిష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మోడీతోనే దేశప్రగతి
Published Wed, Jan 22 2014 3:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవం
పాఠశాలలు తెరిచే నాటికి పనుల పూర్తి
అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు
కేటీపీఎస్ గేమ్స్ సెక్రటరీగా టి.మహేశ్
అప్పుడూ ఇప్పుడూ 'అంతే'
మనమే అభివృద్ధి చేసుకుందాం..
సకుటుంబ సపరివార సమేతం
బీటీపీఎస్ కీర్తి ప్రతిష్టలు పెంచాలి
వంద కేజీల గంజాయి స్వాధీనం
పీహెచ్సీలో డిప్యూటీ డీఎంహెచ్ఓ తనిఖీ
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement