విశాఖ తీరంలో నౌక మునక | Sakshi
Sakshi News home page

విశాఖ తీరంలో నౌక మునక

Published Fri, Nov 7 2014 1:38 AM

Naval torpedo recovery vessel sinks, one killed

ఒకరు మృతి: నలుగురి గల్లంతు
 
 విశాఖపట్నం: నావికాదళానికి చెందిన ఆగ్జిలరీ(సహాయక) నౌక విశాఖ తీరంలో ప్రమాదవశాత్తు గురువారం రాత్రి నీట మునిగింది. టార్పెడో రికవరీ వెసల్ ట్రావ్-72 అనే ఈ నౌక ప్రమాదవ శాత్తు నీట మునిగిందని నేవీ అధికారులు ఢిల్లీలో పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంలో నౌకా సిబ్బంది ఒకరు మృతి చెందగా నలుగురి జాడ తేలియకుండా పోయిందని పేర్కొన్నారు. కాగా, ప్రమాదం నుంచి 23 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్టు తెలిపారు. జాడ తెలియకుండా పోయిన సిబ్బంది కోసం గాలిస్తున్నట్టు వివరించారు.

 

తీర ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ముంచెత్తిన వరద కారణంగానే నౌక మునిగిపోయిందని, విశాఖ తీరానికి 10-15 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. 1983లో గోవా షిప్‌యార్డులో తయారైన ఈ నౌక పొడవు 23 మీటర్లని, గడిచిన 31 ఏళ్లుగా సేవలందిస్తోందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement