లాక్‌డౌన్‌ అమల్లో అత్యుత్తమం | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ అమల్లో అత్యుత్తమం

Published Tue, Apr 14 2020 4:19 AM

NDTV analysis On Lockdown Implementation by AP Govt - Sakshi

సాక్షి, అమరావతి: సంక్షోభాల్లో నాయకత్వ సామర్థ్యాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దేశవ్యాప్తంగా చాటి చెప్పింది. లాక్‌డౌన్‌ అమలులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న తీరులో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం సాధించినట్లు ఎన్డీటీవీ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు వారాల లాక్‌డౌన్‌ అమలులో రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల ప్రభుత్వాల పనితీరు, ఫలితాలను గణాంకాల ఆధారంగా ఎన్డీటీవీ విశ్లేషించింది. ప్రముఖ పాత్రికేయుడు, ఎన్‌డీటీవీ ఎగ్జిక్యూటివ్‌ కో చైర్‌పర్సన్‌ ప్రణయ్‌రాయ్‌ గణాంకాలతో దీన్ని విశ్లేషించారు. 

► ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన సమర్థ చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, మరణాల రేటు తక్కువగా ఉంది.
లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక అత్యుత్తమ పనితీరు కనబరిచాయి. 
► కరోనా కట్టడికి ఏపీ తీసుకుంటున్న పటిష్ట చర్యలు ప్రశంసనీయం. 

Advertisement
Advertisement