సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కోర్టులో కేసులున్నా పట్టించుకోవడం లేదు. ఎక్కడ మట్టి తవ్వకానికి అనుగుణంగా ఉంటే అక్కడ తవ్వేసి అమ్మేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. నీరు- చెట్టు కార్యక్రమం వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. చెరువుల్లో పూడిక తీసి, మొక్కలు నాటడం లక్ష్యంగా ప్రారంభమైన నీరు -చెట్టు పథకం రోజురోజుకూ తెలుగుతమ్ముళ్లు జేబులు నింపే పథకంగా మారిపోతోంది. దీనికి అధికారులు కూడా వంతపాడటం వివాదాలకు దారితీస్తోంది. ఐదేళ్లుగా అది అటవీ భూమి అని ఆ శాఖ... కాదని రెవెన్యూ శాఖల మధ్య వివాదం నడుస్తోండగా, ఆ భూమిని క్వారీ లీజుకు తీసుకున్న వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వివాదం కోర్టులో ఇంకా సాగుతుండగానే తెలుగు తమ్ముళ్లు నీరు-చెట్టును అడ్డం పెట్టుకుని ఆ భూమిలో తవ్వకాలు మొదలు పెట్టారు.
వివరాల్లోకి వెళ్తే....
మార్టూరు మండలం నాగరాజుపల్లి కొండ వద్ద సర్వే నంబర్ 475/పిలో రోడ్డు గ్రావెల్ క్వారీ కోసం అదే గ్రామానికి చెందిన వేల్పుల వీరయ్య గనులు, భూగర్భ శాఖ వద్ద 2009లో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత తహశీల్దార్, సర్వేయర్, ఆర్ఐ వచ్చి తనిఖీ చేసి గనుల శాఖకు నిరభ్యంతర పత్రం ఇచ్చారు. ఆ తర్వాత గనుల శాఖ డిప్యూటీ డెరైక్టర్ ఐదేళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు అంగీకరించారు. సెక్యూరిటీ డిపాజిట్లు, లీజ్ రెంట్ అన్నీ చెల్లించాలని వీరయ్యకు లేఖ పంపారు. అయితే వీటిని చెల్లించడంలో జాప్యం జరిగింది. తర్వాత తనకు పొడిగింపు కావాలని వీరయ్య కోరిన మీదట అధికారులు అంగీకరించి అన్ని ఫీజులు కట్టించుకున్నారు. అయితే క్వారీ మాత్రం వీరయ్యకు అప్పగించలేదు.
అటవీ శాఖ నుంచి అనుమతి తెచ్చుకోవాలని చెప్పారు. అటవీ శాఖ అధికారులు క్వారీలో తమ స్థలం ఉందా లేదా అన్న విషయం సర్వే చేసి చెబుతామన్నారు. అయితే ఈ నాగరాజుపల్లి కొండ మొత్తం అటవీ శాఖ పరిధిలోనే ఉందని అటవీ శాఖ అధికారులు వాదిస్తుండగా, రెవెన్యూ అధికారులు మాత్రం లేదని చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 2011లోనే లీజుదారుడు వీరయ్య తనకు క్వారీ అప్పగించాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. 2013 ఏప్రిల్ ఎనిమిదో తేదీ కలెక్టర్ ఆదేశాలు, కోర్టు ఉత్తర్వుల మేరకు అటవీశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి హద్దులు నిర్ణయించారు. దీనిపై ఇంకా హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది.
ఈ లోగా నీరు-చెట్టు పథకం కింద పక్కనే ఉన్న ఇసుకదర్శి గ్రామంలో నీటిగుంతలలో పూడిక తీయడం కోసం అనుమతులు తీసుకున్న తెలుగుదేశం నాయకులు కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో తవ్వకాలు మొదలు పెట్టారు. పూడిక తీయడం బదులు, మట్టిని తవ్వి హైవే పనుల కోసం అమ్మేసుకుంటున్నారు. ఈ విషయంపై లీజుదారుడు అధికారులను ఆశ్రయించినా వారు తామేం చేయలేమని చేతులెత్తేయడంతో బాధితుడు కోర్టు ధిక్కారం కింద పిటీషన్ వేయడానికి సన్నద్ధం అవుతున్నాడు.
నీరు-చెట్టు..కాసులు పట్టు
Published Wed, May 6 2015 4:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్
కేరళలో విజృంభిస్తున్న వెస్ట్ నైలు జ్వరం కేసులు! ఎందువల్ల వస్తుందంటే..
రాయల్స్పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ఢిల్లీ!
SRH Vs LSG: ప్లే ఆఫ్స్ రేసు.. రెండింటికీ కీలక మ్యాచ్
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం.. మండిపడ్డ బీజేపీ
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి
SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
Sakshi News Cartoon: మన సారే! ఈ మధ్య మరీ దిగజారి మాట్లాడుతున్నారుగా!
KITEX Group: ‘ట్వంటీ20 పార్టీ.. తప్పుడు నిర్ణయాలతోనే ఇబ్బంది’
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement