చుంచు శేషయ్య, మారెళ్ల బంగారుబాబు
ఒంగోలు టూటౌన్ : పాలకుల నిర్లక్ష్యమే రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని వర్జీనియా పొగాకు రైతుల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చుంచు శేషయ్య, మారెళ్ల బంగారుబాబు పేర్కొన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై స్థానిక రంగా భవనంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సంఘం నాయకులు మండిపడ్డారు. తొలుత సంఘం గౌరవ అధ్యక్షులు చుండూరి రంగారావు మాట్లాడుతూ గిట్టుబాటు ధరల కోసం ముఖ్యమంత్రికి, మంత్రులకు, కేంద్ర మంత్రికి విన్నవించినా ఫలితం లేదని, అందువల్లనే నేడు రైతులు ఆత్మహత్యలకు కారణమవుతోందని తెలిపారు.
పొగాకు సంక్షోభంలో పడినప్పుడల్లా గత పాలకులు కేంద్రం, ఎస్టీసీని రంగంలో దించి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయిస్తే నేడు పాలకులు రైతులను విస్మరిస్తూ ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారని దుయ్యబట్టారు. జిల్లాలో శుక్రవారం పురుగుమందు తాగి మరణించిన పొగాకు రైతు బొల్లినేని కృష్ణారావు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షులు చుంచు శేషయ్య మాట్లాడుతూ జులై 4న విజయవాడలో జరిగిన పొగాకు రైతుల సమావేశంలో నిర్ణయించిన ధరలు నేటికి అమలుకు నోచుకోలేదని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్న బోర్డు చైర్మన్ వెంటనే తప్పుకోవాలని సంఘం కార్యదర్శి మారెళ్ళ బంగారు బాబు డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధరలు రాక రోజుకి ప్రతి ప్లాట్ ఫాం నుంచి 400 బేళ్ళవరకు రైతులు వెనక్కు తీసుకెళ్తున్నారని వివరించారు. రైతులను వ్యాపారులు దోపిడికి వదిలేశారని మండిపడ్డారు. బోర్డు ఎస్టీసీని రంగంలోకి దించి పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు.
రైతు కుటుంబానికి రూ.50 వేల సహాయం
టంగుటూరు మండలం పొందూరు గ్రామ పంచాయతీకి చెందిన మృతుడు బొల్లినేని కృష్ణారావు కుటుంబానికి సంఘం తరఫున రూ.50 వేల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. ఈ ఆర్థిక సహాయాన్ని ఆదివారం మృతుని కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నట్లు చుంచు శేషయ్య తెలిపారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, మనోనిబ్బరంతో బతకాలని పేర్కొన్నారు.
పాలకుల నిర్లక్ష్య ఫలితమే రైతుల ఆత్మహత్యలు
Published Sun, Sep 13 2015 2:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement