విశాఖ నుంచి కౌలాలంపూర్‌కు విమాన సర్వీసు | Sakshi
Sakshi News home page

విశాఖ నుంచి కౌలాలంపూర్‌కు విమాన సర్వీసు

Published Fri, Feb 13 2015 8:27 PM

new aeroplane services in between visakha and kuala lumpur staarts on 15th

విశాఖపట్నం: విశాఖ నుంచి కౌలాలంపూర్‌కు ఇక నుంచి నేరుగా విమాన ప్రయాణం చేయొచ్చు. అందుకు మాలిండో ఎయిర్ వేస్ సంస్థ ప్రత్యేక విమాన సేవలు అందిస్తోంది. వారానికి మూడు రోజుల పాటు కౌలాలాంపూర్ - వైజాగ్ మధ్య ప్రయాణించే మాలిండో విమానం ఈ నెల 15వ తేదీన విశాఖలో అడుగుపెట్టనుంది. ప్రతి మంగళ, గురు, ఆదివారాల్లో రాత్రి 9:55 గంటలకు కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బయలుదేరి అదే రోజు రాత్రి 11:10 గంటలకు వైజాగ్‌కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు రాత్రి 11:55 గంటలకు వైజాగ్‌లో బయల్దేరి తెల్లవారు జామున 6:10 గంటలకు కౌలాలంపూర్ చేరుతుందని మాలిండో ఎయిర్ వేస్ హెడ్ కవితా జోషి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీన మలేషియాలో వున్న తెలుగు వారు దాదాపు 250 మంది ఆ రోజు విమానంలో విశాఖకు వస్తున్నారు. వారితో సహా మాలిండో ఎయిర్ వేస్ సీఈఓ చంద్రన్ రామమూర్తి అదే విమానంలో భారత్ విచ్చేస్తున్నారని తెలిపారు.

 

Advertisement
Advertisement