డీఎస్పీని ఆశ్రయించిన నూతన దంపతులు | Sakshi
Sakshi News home page

డీఎస్పీని ఆశ్రయించిన నూతన దంపతులు

Published Thu, Oct 10 2013 2:59 AM

new couples seek help DSP for their marriage

కావలిఅర్బన్, న్యూస్‌లైన్ : నిశ్చితార్థమైన తర్వాత పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మండలంలోని రుద్రకోటకు చెందిన ఆర్‌ఎంపీ ైవైద్యుడు ఆకుల వెంకటేశ్వరరావు, కందుకూరుకు చెందిన ఉప్పుగుండూరు సరస్వతి బుధవారం రాత్రి కావలి డీఎస్పీ ఇందిరను ఆశ్రయించారు. వెంకటేశ్వరరావు, సరస్వతి కథనం మేరకు.. పెద్ద అంగీకారంతో గత నెల 14వ  తేదీ కందుకూరులో తమ వివాహానికి నిశ్చితార్థం జరిగిందన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల సరస్వతి తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించ లేదు. దీంతో తాము బుధవారం బిట్రగుంట కొత్తూరు ఏఈఎల్ బంగ్లా సెంటర్ వద్ద ఉన్న ప్రార్థన మందిరంలో వివాహం చేసుకున్నామని చెప్పారు. స్నేహితుల సహకారంతో వివాహం అనంతరం డీఎస్పీని ఆశ్రయించినట్లు చెప్పారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement