విజయనగరం కంటోన్మెంట్:పౌర సరఫరాల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లెవీ సేకరణను తగ్గించే ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు మిల్లర్లు సేకరిస్తున్న బియ్యంలో 75 శాతం లెవీకి అప్పగించి.. మిగతా 25 శాతం బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం ప్రకారం... ఇకపై మిల్లర్లు సేకరించే బియ్యంలో 25 శాతం మాత్రమే లెవీకి ఇచ్చి, మిగతా 75 శాతం వారు బహిరంగ మార్కెట్లో విక్రయించుకోచ్చు. దీని వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు మిల్లర్లు 25 శాతం లేవీ మాత్రమే సేక రించి, మిగతా దాని గురించి పట్టించుకోరు. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర 25 శాతం తరువాత మరి ఇచ్చే పరిస్థితి ఉం డదు. ఇప్పటివరకు సివిల్ సప్లయ్, లేదా ఎఫ్సీఐ బియ్యాన్ని మిల్లర్లు నుంచి కిలో 26 రూపాయల చొప్పున కొనుగోలు చేసి, కిలో రూపాయి చొప్పన రేషన్ డిపోల ద్వారా పేదలకు అందజేస్తోంది.
అయితే ఈ రూపాయిలో రేషన్ డిపో డీలర్కు 20పైసలు కమీషన్గా చెల్లిస్తోంది. దీంతో కిలో బియ్యంవద్ద కేవలం 80 పైసలు మాత్రమే ప్రభుత్వానికి లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరతోనే లెవీ సేకరణ శాతం ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు రైతులు తేలికపాటి రకాలైన వరి వంగడాలనే సాగు చేసి విక్రయిస్తున్నారు. ఇతర రకాలకు ఈ ప్రాంత భూములు అనుకూలంగా ఉండవు. కేంద్ర ప్రభుత్వ నూతన విధానం వల్ల రైతులు సాగు చేసిన తేలికపాటి పంటను మిల్లర్లు కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకురారు. మద్దతు ధర కూడా కొంతవరకే ఉంటుంది. దళారులు, వ్యాపారులు సిండికేట్ అయి తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు.
దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమా దం ఉంది. బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉన్న మసూరి, సోనా మసూరి, సాంబమసూరి వంటి రకాలను రైతులు ఎప్పటి నుంచో పం డించడం మానేశారు. ఇప్పుడు ఉన్న వర్షాభావ పరిస్థితులు, పెరిగిన పెట్టుబడులతో కేవలం తేలిక రకాలైన 1001,1010 వరి వంగడాలను మాత్రమే సాగు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం రేషన్ భారాన్ని మోయలేమని కేవలం 25 శాతం మాత్రమే తీసుకుంటామని చెబుతుండడంతో మిల్లర్లు 25 శాతం కొనుగోలు చేసి చేతులెత్తేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు. కాగా ప్రస్తుతం జిల్లాకు ప్రతి నెలా 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతున్నాయి. ఈ లెక్కన ఏడాదికి లక్షా 32 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 15 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 25 శాతమే తీసుకుంటామని చెప్పడంతో ఈ భారం రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా పడుతుంది. 26 రూపాయల లెక్కన మిగతా 50 శాతం బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం కష్టమే.
లెవీ సేకరణలో కోత!
Published Tue, Aug 12 2014 1:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement