అధికారులను నిలదీసిన రైతులు | Sakshi
Sakshi News home page

అధికారులను నిలదీసిన రైతులు

Published Tue, Mar 10 2015 2:35 AM

Niladisina officials, farmers

అనంతపురం అర్బన్ : ‘మామిడి మొక్కలు పెంచడానికి అప్పుల చేసి ట్రాక్టర్ల ద్వారా నీళ్లు పోస్తున్నాం.. నాలుగు నెలలైనా నీటి సరఫరా, గుంతలు తవ్విన బిల్లులు ఇవ్వలేదు.. అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తామని కాల యాపన చేస్తున్నారు. వెంటనే బిల్లులు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.  ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రెవెన్యూ భవనం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా (డీడబ్ల్యూఎంఏ) బకా యి పడ్డ బిల్లులు వెంటనే చెల్లించాలని బైఠాయిం చారు.

ఆందోళనకారులు రెవెన్యూ భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఒకటవ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ విశ్వనాథ్ చౌదరి తమ సిబ్బందితో రైతులను అడ్డుకున్నారు. డ్వామా పీడీ నాగభూషణం రైతులకు సర్దిచెప్పడానికి యత్నించినా వా రు ససేమిరా అన్నారు. కలెక్టర్‌తోనే తాము మాట్లాడతామని మొండికేశారు. చివరకు కలెక్టర్ వారిని పిలిపించారు.  

రైతులు మాట్లాడుతూ మొ క్కలకు ట్రాక్టర్ల ద్వారా నీళ్లను సరఫరా చేయిం చాం.. ట్రాక్టర్ల యాజమానులు  బిల్లులు ఇవ్వకపోతే నీటిని సరఫరా చేయబోమని చెబుతున్నార ని కలెక్టర్‌కు తెలిపారు. ఇప్పటికైనా బిల్లులు చెల్లిం చాలన్నారు. లేకపోతే జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధిస్తామన్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.  ఏపీ రైతు సం ఘం జిల్లా అధ్యక్షుడు ఎంకె. వెంకటరెడ్డి ఆధ్వర్యం లో సుమారు 200 మంది రైతులు పాల్గొన్నారు.
 
వృద్ధుల గోడు పట్టించుకునేవారెవరు?
ఏ అధికారికి విన్నవించినా తమ గోడు వినిపించుకోవడం లేదని, నేరుగా కలెక్టర్‌ను కలసి తమ బాధలను వివరించి సాయం పొందాలని వచ్చిన సుమారు 50 మంది వృద్ధులకు నిరాశ ఎదురైంది. వివరాలిలా ఉన్నాయి. హిందూపురం మునిసిపాలిటీ పరిధిలోని 37వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ బీ నాగభూషణ్‌రెడ్డి ఆధ్వర్యంలో పింఛను కోల్పోయిని ముదిరెడ్డిపల్లి వృద్ధులు మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ కోన శశిధర్‌ను కలి సేందుకు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు.

రెవెన్యూ భవన్‌లోకి వెళ్లకుండా వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వృద్ధులు దాదాపు 3 గంటల సేపు అధికారులు పిలుస్తారని వేచి ఉన్నారు. అనంతరం రెవెన్యూ భవనం నుంచి బయటకు వెళ్తున్న కలెక్టర్ వద్దకు వెళ్లారు. తాము పింఛన్లకు అర్హులమేనని, అధికారులకు తమ బాధలు వివరించినా పట్టించుకోవడం లేదని కలెక్టర్‌కు వివరించారు. విచారణ చేసి పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ మిమ్మల్ని ఎవరూ తీసుకువచ్చారని ప్రశ్నించారు.

తమ వార్డు కౌన్సిలర్.. అని వారు చెప్పడంతో అక్కడే ఉన్న కౌన్సిలర్ నాగభూషన్‌రెడ్డితో కలెక్టర్ మాట్లాడుతూ పింఛన్లు వస్తాయిలే.. ‘వృద్ధులకు ఏదో ఒకటి మీరే సర్దిచెప్పండి’  అంటూ అర్జీ కూడా తీసుకోకుండా ఆయన వెళ్లిపోయారు. దీంతో వృద్ధులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీనిపై కౌన్సిలర్ నాగభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ  అక్కడ స్థానిక అధికారులు  స్పందించకపోవడంతో ఇక్కడైన న్యాయం జరుగుతుందని వస్తే  కలెక్టర్ ఇలా సమాధానం చెప్పడం బాధకరమని ఆవేదన వ్యక్తం చే శారు. అర్హులైన వారికి పింఛన్లు అందేలా న్యాయ పోరాటాలు చేస్తామని ఆయన తెలిపారు.
 
కమిటీలో వివక్షపై  సర్పంచ్‌లు,
ఎంపీటీసీల ఫిర్యాదు : గ్రామ స్థాయి కమిటీల్లో తమకు చోటు ఇవ్వకుండా టీడీపీ నాయకులే నిర్ణయాలు తీసుకుంటున్నారని ైవైఎస్సార్‌సీపీ సర్పంచులు, ఎంపీటీసీలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా రు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ గ్రామ స్థాయి కమిటీలో సర్పంచే అధ్యక్షుడా..? సర్పంచ్ అధ్యక్షతన సామాజిక భద్రత పింఛన్లు జాబితా.. తయారు అవుతుందా..? అని ఆయన ఎదురు ప్రశ్నించడంతో వారు ఆశ్చర్యపోయారు.

పైగా మీరు పార్టీ సింబల్‌పై గెలువలేదు కదా..? అలాటప్పడు మీరు రాజకీయాలు చేయడం ఎందుకని సర్పంచులను కలెక్టర్ ప్రశ్నించడంతో వారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు నరసింహరెడ్డి, సుగుణ, నాగరత్నమ్మ, సుహాసన, ఉదేప్ప, తిక్కమ్మ, ఎంపీటీసీలు యల్ల క్క, లక్ష్మిదేవమ్మ, తదితరులు మాట్లాడుతూ గ్రామ స్థాయి కమిటీల్లో సర్పంచ్ అధ్యక్షుడుగా, గ్రామ కార్యదర్శి కన్వీనర్‌గా ఎంపీటీసీ, డ్వాక్రా సంఘాల నుంచి ఇద్దరు, సామాజిక కార్యకర్తలు ఇద్దరు చొప్పున సభ్యులుగా ఉంటారని తెలిపారు.

సామాజిక భద్రత పింఛన్‌లో, దీపం పథకం ద్వారా లబ్ధిదారుల ఎంపిక జాబితాను ఈ కమిటీ నిర్ణయిస్తుందన్నారు. ఈ కమిటీలో టీడీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఉండకూడదని, ఏలాంటి నిర్ణయాధికారం వీరికి లేదని ఇటీవల హైకోర్టు ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపిందన్నారు. అయినప్పటికీ అధికారులు ఈ విషయంపైన అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో టీడీపీ నాయకులు, తమ నిర్ణయాలు ప్రకారం జాబితా తయారు చేస్తున్నా విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన ఫలితం లేదన్నారు. దీనిపై తాడోపేడో తేల్చుకుంటామన్నారు.
 
అధికారులు తప్పక హాజరు కావాలి.. కలెక్టర్
ప్రతి అధికారి మీ కోసం కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్వహించిన మండల, డివిజన్ స్థాయి మీ కోసం కార్యక్రమాన్ని కలెక్టర్ రెవెన్యూ భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.     

రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో 802 అర్జీలు అందాయి. వాటిని క్యాటగిరి వారిగా విభజించి ఆయా శాఖలకు ఆర్జీలను పంపిణీ చేశారు.   కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జే సీ లక్ష్మీకాంతం ఏజేసీ ఖాజామొహిద్దీన్ , డీఆర్‌ఓ పీహెచ్ హేమసాగర్, జెడ్పీసీఈఓ రామచంద్ర, ఆర్‌డబ్య్లూఎస్‌సీ కాంతనాథ్, హౌసింగ్ పీడీ ప్రసాద్ తదితరులు వినతులు స్వీకరించారు.

Advertisement
Advertisement