బెయిల్ షరతులు సడలించండి: నిమ్మగడ్డ | Sakshi
Sakshi News home page

బెయిల్ షరతులు సడలించండి: నిమ్మగడ్డ

Published Sat, Nov 2 2013 12:40 AM

బెయిల్ షరతులు సడలించండి: నిమ్మగడ్డ

సాక్షి, హైదరాబాద్: వ్యాపార అవసరాల కోసం నెల రోజులపాటు హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటషన్ దాఖలు చేశారు. వ్యాపార కార్యకలాపాల కోసం ఇతర ప్రాం తాలకు వెళ్లాల్సి ఉన్నందున హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న షరతును సడలించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 7కు వాయిదా వేసింది.
 
 విజయరాఘవకు బెయిల్ షరతుల సడలింపు: ఎమ్మార్ కేసులో నిందితునిగా ఉన్న ఎమ్మార్ ఎంజీఎఫ్ ఫైనాన్స్ విభాగం ఉన్నతాధికారి విజయరాఘవ బెయిల్ షరతులను సీబీఐ కోర్టు శుక్రవారం సడలించింది. శనివారం నుంచి 2014 ఏప్రిల్ 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలో పర్యటించేందుకు కోర్టు అనుమతించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement