గజ్వేల్, న్యూస్లైన్: మూడు జిల్లాల రైతులకు గజ్వేల్ మార్కెట్ యార్డే ప్రధాన ఆధారం. వారు పండించిన పంటలన్నీ ఈ యార్డుకే తరలించి విక్రయించుకుంటారు. కానీ యార్డు లో ‘బీట్’ విధానం అమల్లోకి తేవడంలో సంబంధిత అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొనుగోలుదారుల మధ్య పోటీతత్వం కరువై వారు చెప్పిన ధరకే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తోంది. మరోపక్క ట్రే డ్ లెసైన్స్లు లేని దళారులు కల్లాల వద్దే కాంటాలు నిర్వహిస్తూ తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు మాత్రం తమకేం పట్టనట్లు వ్యవ హరిస్తున్నారు. అంతిమంగా రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు.
అధికారుల అలసత్వం..దళారులకు వరం
జిల్లాలోని వివిధ ప్రాంతాలకే కాకుండా వరంగల్, నల్గొండ జిల్లాల రైతులకు ప్రధాన మార్కెట్ గజ్వేల్ యార్డు. అందువల్లే ఇక్కడ వ్యాపారుల మాయాజాలానికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు రెండేళ్లక్రితం నుంచి ‘బీట్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొనుగోలుదారుల మధ్య పోటీతత్వం పెంచితే రైతులకు గిట్టుబాటు ధర అందించవచ్చనే భావనతో ఈ విధా నం తెచ్చారు. ఈసారి సీజన్ పూర్తి కావస్తున్నా.... అధికారులు ఇంకా మీనమేషాలు లెక్కించడం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘బీట్’ లేక పోవడంవల్ల వ్యాపారులు నిర్ణయించిన ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకొని వెళ్తున్నారు. అంతేకాకుండా పత్తికి వంద కిలోల సంచిపై తరుగు పేరిట ఇష్టానుసారంగా కోత పెడుతుండగా నియంత్రించే వారు కరువయ్యారు.
కల్లాల వద్ద కాంటాలతో మోసాలు
గ్రామాల్లో ట్రేడింగ్ లెసైన్స్లేని దళారుల మోసాలు రైతులకు శాపంగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కల్లాల వద్ద కాంటాలను నిర్వహిస్తున్న దళారులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లను జరుపుతున్నా మార్కెటింగ్ శాఖ నియంత్రణ లేక పోవడంవల్ల వారు మరింత చెలరేగిపోతున్నారు. కొందరైతే తూకపు బాట్ల స్థానంలో బండరాళ్లను ఉంచి నిలువునా దోచుకుంటున్నారు.
‘బీట్’ లేనట్లే!
Published Sat, Feb 15 2014 12:15 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు
ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్
తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు
ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...
Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!
ఒకరోజు వర్షాకాలం ఉదయాన్నే.. నదికి వెళ్లిన ముని..
బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
నెహ్రూ తర్వాత మోదీనే అంటూ ఢిల్లీ బయల్దేరిన రజనీకాంత్
‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
తప్పక చదవండి
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- 39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- ‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
- ఘోరం: వివాహిత మిస్సింగ్, మూడురోజల తర్వాత..
- ముగిసిన చేప ప్రసాదం పంపిణీ, మిస్ అయిన వాళ్ల కోసం..
- ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష
Advertisement