కౌంటింగ్ హాలులోకి మీడియాకు నో ఎంట్రీ.. | Sakshi
Sakshi News home page

కౌంటింగ్ హాలులోకి మీడియాకు నో ఎంట్రీ..

Published Tue, Jul 7 2015 9:13 AM

NO entry for Media at MLA election counting hall

 ప్రకాశం/ కర్నూలు: ఏపీ లోని ప్రకాశం, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. కర్నూలు టౌన్ మోడల్ స్కూలులో జిల్లాకి చెందిన ఓట్లను లెక్కిస్తున్నారు. అయితే, కౌంటింగ్ హాలులోకి మీడియాను పోలీసులు అనుమతించలేదు. ఇందుకు నిరసనగా జర్నలిస్టులు ధర్నాకు దిగారు.

అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు మున్సిపల్ ఆఫీస్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ప్రకాశం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన విషయం విదితమే.

Advertisement
Advertisement