ఒకరోజు సమ్మె చేసిన బీమా ఉద్యోగులు
కర్నూలు(జిల్లా పరిషత్): బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు వద్దని, దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ కర్నూలు యూనిట్ కార్యదర్శి ఆర్. సునీల్కుమార్ చెప్పారు. ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఇఏ) పిలుపు మేరకు సోమవారం బీమా ఉద్యోగులు ఒక రోజు సమ్మె చేసి కర్నూలులోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్కుమార్ మాట్లాడుతూ రాజ్యసభలో పెండింగ్లో ఉన్న బిల్లును అలాగే వదిలేసి లోక్సభలో ఇదే బిల్లును ప్రవేశపెట్టడం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేసే పని సరికాదన్నారు.
రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టాక అది పార్లమెంటు ఉమ్మడి ఆస్తి అవుతుందన్నారు. ఆమోదించడమో, తిరస్కరించడమో, ఉపసంహరించడమో సభ ఆమోదంతోనే జరగాలన్నారు. అదేమీ లేకుండా మరో సభలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్దమని తెలిపారు. ఇప్పటి వరకు పార్లమెంటు చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని, ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోందని విమర్శించారు. నిధుల లేమి వల్ల బీమా వ్యాపారం విస్తరించడం లేదని, నూతన సాంకేతిక పరిజ్ఞాన ం, నూతన ఉత్పత్తులు వస్తాయని ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందన్నారు.
ప్రైవేటు బీమారంగ సరళీకరణ వల్ల ఒరిగేదీ లేదని, దేశీయ ప్రైవేటు భాగస్వాముల వద్ద నిధుల కొరత ఏమీ లేదన్నారు. ఎందుకంటే దేశీయ బీమా కంపెనీల భాగస్వాములు(టాటా, బిర్లా, రిలియన్స్)వంటి కార్పొరేట్ దిగ్గజాలు అనేక దేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయని, ఇందులో భాగంగా ప్రైవేటు కంపెనీల సేవలపై ఫిర్యాదులు నానాటికీ మిన్నంటుతున్నాయని చెప్పారు. బీమా నియంత్రణ సంఘం(ఐఆర్డిఏ)కు రెండు లక్షలపై ఫిర్యాదులు వస్తున్నాయంటే ప్రైవేటు బీమా కంపెనీల పనితీరును మనం అర్థం చేసుకోవచ్చన్నారు.
పాలసీదారులకు ఆర్థిక భద్రత కల్పించడం, చిన్నమొత్తాల పొదుపును సమీకరించి, దేశ మౌళిక వనరుల కల్పనకు పెట్టుబడులుగా ఉపయోగించడంలో బీమా రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అనంతరం యూనియన్ అధ్యక్షుడు మక్బుల్ అహ్మద్, ఉపాధ్యక్షురాలు కె. నాగమణి, సెక్రటరి ఎం. అమీర్బాషా, ఎల్ఐసీ సీనియర్ బ్యాంక్ మేనేజర్ ఎన్. శంకర్నాయక్, నాయకులు ఎ. ప్రతాప్రెడ్డి, సుధాకర్రెడ్డి, పుల్లారెడ్డి, రామాంజనేయులు, రాధాకృష్ణ, అంజిబాబు పాల్గొని ప్రసంగించారు.
సమ్మె విజయవంతం
ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 26 నుంచి 49 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలోని నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలైన యునెటైడ్ ఇండియా, న్యూ ఇండియా, ఓరియంటల్, నేషనల్ కంపెనీల్లో సమ్మె విజయవంతం అయింది. ఏఐఐఈఏ ఇచ్చిన సమ్మె పిలుపునకు స్పందించి స్థానిక ఓరియంటల్ ఇన్సూరెన్స్, భూపాల్ కాంప్లెక్స్లో జరిగిన సమ్మెలో జిల్లా కార్యదర్శి జి. శివకుమార్, ఉపాధ్యక్షులు జయశ్రీ, అజీజ్, రంగనాథరెడ్డి పాల్గొన్నారు. లాభాల బాటలో పయనిస్తున్న ప్రభుత్వ రంగ కంపెనీలను విదేశీయుల చేతుల్లోకి పోకుండా అందరూ పోరాడాలని వారు కోరారు.
బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు వద్దు
Published Tue, Mar 10 2015 2:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement