‘అధికారం కోసం రంగులు మార్చడంలో బాబు దిట్ట’ | Sakshi
Sakshi News home page

‘అధికారం కోసం రంగులు మార్చడంలో బాబు దిట్ట’

Published Tue, Aug 13 2013 6:07 PM

‘అధికారం కోసం రంగులు మార్చడంలో బాబు దిట్ట’ - Sakshi

హైదరాబాద్: అధికారం కోసం రంగులు మార్చడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిట్టని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిని ఆయన బాబు వైఖరిపై మండిపడ్డారు. అధికారం కోసం మాట, రంగులు మార్చడంలో బాబును మించిన వారెవరూ ఉండరన్నారు. చంద్రబాబుకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు, కిరణ్ కుమార్‌రెడ్డిలు ఇద్దరూ తోడు దొంగలేనన్నారు.
 
 సోమవారం రాజ్యసభలో టీడీపీ నేత హరికృష్ణ నటించారన్నారు. బావ చంద్రబాబు ఇచ్చిన షాక్‌తో హరికృష్ణకు మైండ్ బ్లాక్ అయ్యింటుందని హరీష్‌రావు అన్నారు. గతంలో తండ్రి ఎన్టీఆర్‌పై చెప్పులు వేసిన హరికృష్ణ..అదే తండ్రి సమాధికి రాజీనామా సమర్పించారన్నారు. రాజీనామా చేసిన హరికృష్ణ రాజ్యసభకు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు.
 
 హరికృష్ణకు సొంత బావ అయిన చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలుసుకోవాలన్నారు. టీ.టీడీపీ ఎంపీలు దేవేందర్ గౌడ్, గుండు సుధారాణిలు ఎందుకు గైర్హాజరయ్యారని  హరీష్‌రావు నిలదీశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement