సత్తెనపల్లిరూరల్, న్యూస్లైన్
సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి రైతులకు మద్దతు ధర క ల్పిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆర్భాటంగానే మిగిలిపోతున్నాయి. ఆచరణలో మాత్రం ఎక్కడా సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో పత్తి రైతులు ఆరంభంలోనే కనీస ధర లేక దగా పడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి సాగు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ దిగుబడి అందే సమ యానికి నిరాశే మిగిలింది. మండలంలో సుమారు 8,600 హెక్టార్లలో పత్తి సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు అంచనా. గత ఏడాదితో కంటే ఏడాది అదనంగా సుమారు 500 హెక్టార్లలో సాగు చేశారు.
ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో కొంత మేర వాడకం త గ్గింది. ఈ ఏడాది దిగుబడి బాగుంటుందని రైతులు ఆశించారు. అయితే పై-లీన్, లెహర్ తుపానుల ప్రభావంతో అంచనాలు తలకిందులయ్యాయి. దీనికి తోడు మద్దతు ధర లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు, గత ఏడాదితో పోలిస్తే కూలి వ్యయం మరింతగా పెరిగింది. గతంలో రూ. 100 వున్న కూలి ప్రస్తుతం రూ. 150 కి చేరింది. పైగా పత్తి సాగు అధికం కావటం, ఎక్కువగా బీటీ రకం సాగు చేయటంతో పత్తి తీత అంతా ఒకే సారి వచ్చింది. దీంతో కూలీల కొరత ఏర్పడింది. గతంలో క్వింటా పత్తి తీసేందుకు రూ. 800 వరకు ఖర్చు కాగా, నేడు రూ.1500 వరకు చెల్లిస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల వరకు దిగుబడి వ చ్చింది.
రంగంలోకి దిగిన ప్రైవేటు వ్యాపారులు
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునే సమయంలో ప్రైవేట్ వ్యాపారులు రంగ ప్రవేశం చేసి తక్కువ ధరకే సొమ్ము చేసుకుంటున్నారు. సాగుకు అప్పులు ఇచ్చిన రుణ దాతల నుంచి ఒత్తిడి పెరగటంతో మంచి ధర కోసం వేచి చూసే పరిస్థితి లేకపోయింది. దీనికి తోడు తుపానుల ప్రభావంతో పత్తిరంగు కొంత మేర మారటంతో నిల్వ చేసేందుకు రైతులు ఆసక్తి చూపటం లేదు. దీంతో ధర గిట్టుబాటు కాకపోయినా వ్యాపారులు నిర్ణయించిన ధరకు తెగనమ్ముకుంటున్నారు. తేమ శాతం అంటూ వ్యాపారులు క్వింటా పత్తిని రూ. 3000 నుంచి రూ. 3200 వరకు కొనుగోలు చేస్తున్నారు.
జాడ లేని సీసీఐ కేంద్రాలు.. మద్దతు ధర ప్రకటించి సీసీఐ కేంద్రాలతో రైతుల వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సత్తెనపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ కేంద్రం ఏర్పాటు చే యిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని రైతులు వాపోతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు నిర్ణయించిన ధరకు పంటను తెగనమ్ముకుంటున్నా సీసీఐ కేంద్రాల ఏర్పాటు చేయకపోవడం దారుణమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెల్లబోయిన రైతు
Published Sat, Dec 7 2013 3:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement