సాక్షి, నిజామాబాద్ : తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన సైకిల్ యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. మరోవైపు తెలంగాణవాదుల నుంచి ఈ యాత్రకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి రెండు కళ్ల సిద్ధాంతంతో ఇప్పటికే జిల్లాలో టీడీపీ దెబ్బతినగా.. మిగిలిన కార్యకర్తల్లో కూడా ఈ యాత్ర ఏమాత్రం ఉత్సాహన్ని నింపలేకపోతోంది. టీడీపీలో ఇటీవలే తెరపైకి వచ్చిన మదన్మోహన్రావు చేపట్టిన సైకిల్యాత్ర అక్టోబర్ 28న మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్ మీదుగా బిచ్కుంద మండలం వడ్లంలోకి ప్రవేశించింది. జుక్కల్ నియోజకవర్గంలో పలు మండలాల్లో ఈ యాత్రకు ఆశించిన మేరకు ప్రజాదరణలభించలేదు. ఒకటి రెండు చోట్ల మినహా బాన్సువాడ నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.
నిరసనలు.. అడ్డగింతలు
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజుల్లో కనిపించని ఈ నేతలు ఇప్పుడు ప్రజా సమస్యల పేరుతో యాత్రలు చేపడితే ప్రజలెలా నమ్ముతారని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. బాన్సువాడ మండలం రాంపూర్ వద్ద స్థానికులు, గిరిజనులు ఆదివారం ఈ యాత్రను అడ్డుకున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టీడీపీ ఇచ్చిన లేఖతోనే కేంద్రం తెలంగాణ ప్రకటించిందని చెబుతున్న నేతలు అదే చంద్రబాబుతో ఎందుకు జై తెలంగాణ అనిపించడం లేదని వారు ప్రశ్నించారు. మం గళవారం ఈ యాత్రలో పాల్గొనేందుకు బాన్సువాడకు వెళ్లిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీజీ గౌడ్, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డిలకు కూడా చేదు అనుభవం ఎదురైంది. టీ ఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ కార్యక్రమంలో టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొనాల్సి ఉంది. కానీ తెలంగాణవాదుల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగానే ఆయన పర్యటన రద్దయినట్లు సమాచారం.
పార్టీలో అయోమయం
జిల్లాలో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో సాగుతున్న ఈ యాత్రపై పార్టీ జిల్లా శాఖలో అయోమయం నెలకొంది. యాత్రను విజయవం తం చేయాలని ఆ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు పిలుపునిచ్చిన దాఖలాల్లేవు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఈ యాత్రలో పాల్గొన్నప్పటికీ.. రూరల్ ఎమ్మెల్యే మం డవ వెంకటేశ్వరరావు వంటి జిల్లా నాయకులు యాత్రకు దూరంగా ఉన్నారు.
పార్టీ పరిస్థితి దయనీయం
జిల్లాలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సైకిల్ యాత్ర సాగనున్న ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జి కూడా లేకపోవడం పార్టీ దయనీయ పరిస్థితికి నిదర్శనం. కామారెడ్డి నియోజకవర్గంలో నూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండటానికీ ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. జిల్లాలో ముఖ్య నేతలు సైతం రానున్న ఎన్నికల్లో పొటీ చేసేందుకు వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. పోటీ చేయాలా వద్దా అన్న విషయాన్ని వారు తేల్చుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో కొత్తగా పార్టీలో తెరపైకి వచ్చిన మదన్మోహన్రావు జిల్లా ప్రజలకు తనను పరిచయం చేసుకోవడం కోసం పడుతున్న పాట్లలో భాగమే ఈ యాత్ర అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ సైకిల్ యాత్ర అట్టర్ఫ్లాప్
Published Wed, Nov 6 2013 4:22 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
లవ్ మీ సినిమా స్టోరీ లీక్ చేసిన బ్యూటీ, క్లైమాక్స్ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)
ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండు చిత్రాలే స్పెషల్!
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
బెస్ట్ ఏఐ టూల్స్.. పీడీఎఫ్ ప్రశ్నలకు ఇట్టే సమాధానం
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement