ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య ఐఆర్పై తేలని చర్చ
అవసరమైతే ఆందోళన చేపడతామని ఉద్యోగుల హెచ్చరిక
ఆర్థిక మంత్రి వద్ద అసంపూర్తిగా ముగిసిన చర్చలు
నేడు ఉదయం సీఎం వద్ద సమావేశం..
22 శాతం ఇచ్చినా ఖజానాపై రూ. 6,259 కోట్లు భారం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్)పై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఉద్యోగ సంఘాల మధ్య బుధవారం జరిగిన చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. 22 శాతం ఐఆర్ ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆర్థిక మంత్రి చేసిన ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు అంగీకరించలేదు. ‘‘నేను సున్నా నుంచి ప్రారంభించలేదు. 17 శాతం ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి సహకరిస్తుంది. దానికి అంగీకరించండి’’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు. చివరికి.. 22 శాతం ఇవ్వడానికి మంత్రి అంగీకరించారు. అంతకు మించి ఇచ్చే అధికారం ఆర్థిక మంత్రిగా తనకు లేదని.. ముఖ్యమంత్రి సమక్షంలోనే తేల్చుకోవాలని సూచించారు. 22 శాతం ఐఆర్ ఇచ్చినా.. రాష్ట్ర ఖజానాపై ఏటా రూ. 6,259 కోట్ల భారం పడుతుందని ఆనం తెలిపారు.
అయితే తొలుత 45 నుంచి 50 శాతం ఐఆర్ ఇవ్వాల్సిందేనని ప్రకటించిన ఉద్యోగ సంఘాలు.. చర్చల సందర్భంగా కాస్త మెత్తబడి 32 శాతానికి దిగాయి. కానీ, అంతకన్నా తక్కువగా ఇస్తామంటే అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పడంతో.. చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో ఐఆర్పై చర్చ ముఖ్యమంత్రి వద్దకు చేరింది. గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వద్ద ఉద్యోగ సంఘాలతో చర్చలు జరగనున్నాయి. ఇందులో తుది నిర్ణయం తీసుకొనే అవకాశముంది. నూతన సంవత్సర కానుకగా ఐఆర్ ఇస్తామని గత వారమే ఉద్యోగ సంఘాలకు సీఎం హామీ ఇచ్చారు. కానీ ఐఆర్ ప్రకటన రాకుండానే ఉద్యోగులు నూతన సంవత్సరంలో అడుగుపెట్టారు. గురువారం జరిగే చర్చల్లోనైనా ఉద్యోగులు సంతృప్తి చెందే విధంగా ఐఆర్ ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు. ఒకవేళ 32 శాతానికి ప్రభుత్వం అంగీకరించకుంటే.. ఆందోళనకు దిగుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.
22% ఇస్తాం.. 32% ఇవ్వాల్సిందే..
Published Thu, Jan 2 2014 2:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
4 నెలల్లోనే రేవంత్ అబద్ధాలకోరు అని తేలింది
జగన్కు జైన్ సంఘం మద్దతు
త్వరితగతిన చందనోత్సవం ఏర్పాట్లు
మూడోరోజు 3,500 పోస్టల్ ఓటింగ్
వైఎస్సార్సీపీలోనే కాపులకు ప్రాధాన్యం
యాదవుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ పెద్దపీట
‘వర్షా’తిరేకం!
ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
స్టీల్ప్లాంట్పై సీఎం ప్రకటన హర్షణీయం
ఓటుకు రేటు.!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement