ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులతో సీఎం
టి.తీర్మానం వచ్చినప్పుడు ఓడించడానికి కృషి చేస్తామని హామీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వీలుగా వెంటనే శాసనసభను సమావేశపరచి సమైక్య తీర్మానం చేయించడానికి చర్యలు తీసుకోవాలంటూ ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక’ చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సానుకూలంగా స్పందించలేదు. వేదిక నేతలు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, వి.లక్ష్మణరెడ్డి, జ్యోతితో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ‘‘రాష్ట్ర విభజన చేయాలని ఉత్తరప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసినా ఎలాంటి ఫలితం రాలేదని, కేంద్రం పట్టించుకోలేదని సీఎం గుర్తు చేశారు. మన శాసనసభలో సమైక్య తీర్మానం చేయడంవల్ల కూడా ప్రయోజనం ఉండదని చెప్పారు. తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వచ్చినప్పుడు ఓడించడానికి కృషి చేస్తామని, అందువల్ల ప్రయోజనం ఉంటుందన్నారు’’ అని భేటీ అనంతరం జస్టిస్ లక్ష్మణరెడ్డి వెల్లడించారు. సమైక్యవాదులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సభలు, సమావేశాలు పెట్టుకోవడానికి అనుమతి మంజూరు చేయమని పోలీసులను ఆదేశించాలని తాము విజ్ఞప్తి చేయగా, పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పామని, దీనికి సీఎం స్పందించలేదని తెలిపారు. రాష్ట్ర సమైక్యతను కోరుతూ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి అఫిడవిట్లు తీసుకుంటున్నామని, ముఖ్యమంత్రిగా మీరూ సంతకం చేయమని కోరగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.
సమైక్య తీర్మానం వల్ల ఫలితం ఉండదు
Published Sat, Oct 19 2013 1:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement