అక్రమ నిర్మాణాలపై ఎంపీ గోకరాజుకు నోటీసులు | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలపై ఎంపీ గోకరాజుకు నోటీసులు

Published Fri, Feb 6 2015 7:42 PM

అక్రమ నిర్మాణాలపై ఎంపీ గోకరాజుకు నోటీసులు - Sakshi

గుంటూరు: కృష్ణానది కరకట్టలపై అక్రమ నిర్మాణాలు చేశారంటూ నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు నోటీసులు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి గోకరాజుతో సహా 23 మందికి స్థానిక తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10 లోగా ఒరిజినల్ డాక్యుమెంట్లతో హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నీటి పారుదల శాఖ కూడా వారికి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement