విజయవాడలో ఎన్టీఆర్‌ మ్యూజియం | Sakshi
Sakshi News home page

విజయవాడలో ఎన్టీఆర్‌ మ్యూజియం

Published Wed, Jan 18 2017 1:43 AM

విజయవాడలో ఎన్టీఆర్‌ మ్యూజియం

సాక్షి, అమరావతి: స్వర్గీయ నందమూరి తారక రామారావు 21వ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఎన్టీఆర్‌ అభిమాన సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అమరజ్యోతి ర్యాలీని నిర్వహిస్తుండగా, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విజయవాడలో ఎన్టీఆర్‌ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు.

ఈ నెల 18 నుంచి 25 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మ్యూజియంలోకి ప్రజలను అనుమతిస్తారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మొట్టమొదటి సారిగా ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పార్టీ కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్థన్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement