డెంకాడ, న్యూస్లైన్:
భవిష్యత్లో దేశ ప్రజలకు విద్యుత్, ఇతర అవసరాలు తీరాలంటే అణుశక్తి (న్యూక్లియ ర్ పవర్) తప్పదని న్యూక్లియర్ రీ సైకిల్ గ్రూప్ డెరైక్టర్ పికె వత్తల్ అన్నారు. ‘జాతీయ అభివృద్ధిలో అణుశక్తి పాత్ర’ అనే అంశంపై చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అణుశక్తి వినియోగంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తీర్చేందుకు రెండు రోజులుగా జరుగుతున్న సదస్సు ఉపకరించి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సులో ఏర్పాటు చేసిన ప్రదర్శన కూడా చైతన్యం కలిగించిందన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎల్ రాజు మాట్లాడుతూ ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంత పెద్దస్థాయిలో అణుశక్తిపై సదస్సు నిర్వహించడం హర్షణీయమన్నారు. దీని ద్వారా యువత, విద్యార్థులు, అధ్యాపకుల్లో కూడా అవగాహన వచ్చిందన్నారు. కార్యక్రమంలో బార్క్ మీడియా రిలేషన్ హెడ్ ఆర్కే సింగ్, వైస్ ప్రిన్స్పాల్ డీజేఏ రామచంద్రరాజు, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ రంగరాజు, పలు విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
క్విజ్ విజేతలకు బహుమతులు
రెండు రోజుల అణుశక్తి సదస్సుపై విద్యార్థుల కు శుక్రవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయనగరంలోని సన్ స్కూల్కు చెందిన ఎంఎన్ఎస్ నాగేంద్ర మొదటి స్థానం లో నిలిచారు. అలాగే శ్రీప్రకాష్ విద్యాసంస్థకు చెందిన జి సాయికార్తీక్, జి సాయిసాగర్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలు అంజేశారు. ప్రతిభ కనబరిచిన మరి కొందరు విద్యార్థులకు కూడా ప్రశంసాపత్రాలు అందించారు. వీరిని త్వరలో బార్క్కు ఆహ్వానిస్తారు.
భవిష్యత్లో న్యూక్లియర్ అవసరం
Published Sat, Jan 25 2014 3:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement