హైదరాబాద్, న్యూస్లైన్: హైదరాబాద్లో నర్సింగ్ కోర్సు చేస్తున్న మెదక్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని డెంగీతో చి కిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. నర్సింగ్ స్కూ ల్ ప్రిన్సిపాల్, ఉస్మానియా వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని నర్సింగ్ విద్యార్థినులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..మెదక్ జిల్లా టేక్మాల్కు చెందిన నాగభూషణం, స్వ రూపల మొదటి సంతానమైన మౌనిక(20) ఉస్మానియా నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
ఈ నెల 3న మౌనికతోపాటు పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో ఇన్పేషెంట్లుగా చేర్చుకున్నారు. వైద్య పరీక్షల్లో మౌనికకు డెంగీ సోకినట్టు తేలిం ది. అప్పటికే ఆమె ఆరోగ్యం విషమించి అపస్మారక స్థితికి చేరుకోవడంలో వెంటిలేటర్పై వైద్యం అందించారు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున చనిపోయింది. వైద్యు ల నిర్లక్ష్యం, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లే మౌనిక చనిపోయిందని ఆరోపిస్తూ సహచర విద్యార్థినులు ఆం దోళనకు దిగారు. వీరికి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు సంఘీభావం తెలిపి ఆసుపత్రిలోని కులీకుతుబ్షా భవనం ఎదుట బైఠాయించారు.
విషయం తెలిసి ఆసుపత్రికి వచ్చిన ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరామిరెడ్డి, ఆర్ఎంఓ-1 డాక్టర్. ఎం.అంజయ్య, ఆర్ఎంఓ డాక్టర్ నజాఫీబేగం, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ శాంతకుమారిలను ఘెరావ్ చేశారు. మౌనిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సూపరింటెండెంట్ డాక్టర్ శివరామిరెడ్డి నర్సింగ్ విద్యార్థినులు, ఎ్స్ఎఫ్ఐ ప్రతినిధులతో చర్చలు జరిపి డిమాం డ్లను నెరవేరుస్తామని, మౌనిక తల్లి స్వరూపకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థినులు శాంతిం చారు. మౌనిక అంత్యక్రియల నిమిత్తం ఆయన రూ.10 వేల ఆర్థిక సాయం అందించగా.. నర్సులు, ఇతర సిబ్బంది రూ.15 వేల నగదును పోగుచేసి మౌనిక తల్లికి అందజేశారు. అనంతరం మౌనిక మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
డెంగీతో నర్సింగ్ విద్యార్థిని మృతి
Published Mon, Oct 7 2013 3:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement