Sakshi News home page

విశాఖలో మహిళపై సామూహిక అత్యాచారం

Published Fri, Apr 24 2015 9:55 AM

విశాఖలో మహిళపై సామూహిక అత్యాచారం

విశాఖపట్నంలో మరో దారుణం జరిగింది. భువనేశ్వర్ కు చెందిన ఓ మహిళపై ఓ ఆటోడ్రైవర్, అతని స్నేహితులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను పాత గోపాలపట్నం వాసులు గుర్తించి, ఆశ్రయం కల్పించారు. అయితే పోలీసులకు సమాచారం ఇవ్వబోతే.. పరువుపోతుందని భయపడి అవమాన భారంతో మహిళ ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement