విషయం : ఏసీడీపీ నిధులు
వచ్చినవి : రూ.43.47 కోట్లు
ఖర్చయినవి : రూ.33.09 కోట్లు
ఖజానాలో : రూ.10.38 కోట్లు
సమయం : రెండు నెలలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమం నిధుల(ఏసీడీపీ) వినియోగంపై నిర్లక్ష్యం కనిపిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం వచ్చిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇన్చార్జి మంత్రుల నిధులు సకాలంలో ఖర్చుకాకపోవడంతో మురిగిపోనున్నాయి. ఏసీడీపీ కింద జిల్లాకు రూ.43.47 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రూ.33.09 కోట్లు ఖర్చు చేశారు. 2014 మార్చి 31లోగా నిధులు ఖర్చు చేయాలి. అంటే రెండు నెలల వ్యవధిలో రూ.10.38 కోట్లు ఖర్చు కావాలి. ఇది సాధ్యం అయ్యేట్లుగా లేదు. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు ఏటా విడుదలయ్యే నిధుల్లో అత్యధికంగా తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలి. నిధులు ఖర్చు చేయకపోవడంతో అభివృద్ధి పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. తాగునీరు, రోడ్ల నిర్మాణం పనులు పూర్తిగా నిలిచాయి.
నిధుల విడుదల, వినియోగం..
అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి కోసం మంజూరయ్యే నిధులతోనే ఆయా నియోజకవర్గాల్లో ప్రగతి పనులు చేపట్టాలి. సీసీ రోడ్లు, కల్వర్టులు, ఆలయాలు, ప్రార్థన మందిరాలు, ప్రహరీలు, కమ్యూనిటీ హాళ్లు, తాగునీటి అవసరాల కోసం వినియోగించవచ్చు. డ్రెయినేజీల నిర్మాణం, వంతెనలు, నీటి ట్యాంకులు, గ్రామ పంచాయతీ భవనాలు, మైనర్ ఫీడర్ చానల్స్, ట్రాన్స్ఫార్మర్ల మంజూరుకు ఖర్చు చేయవచ్చు. ఏటా ఏసీడీపీ కింద ఒక్కో నియోజకవర్గానికి రూ.1 కోటి మంజూరైతే ఇందులో రూ.50 లక్షల పనులను నేరుగా స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి పనులను ప్రతిపాదించవచ్చు. మిగతా రూ.50 లక్షలు జిల్లా ఇన్చార్జి మంత్రి తన కోటాగా పరిగణించి అభివృద్ధి పనులకు ప్రతిపాదించినా.. స్థానిక ఎమ్మెల్యే సిఫారసుల మేరకు ఖర్చు చేస్తారు. ఇక్కడే ఏసీడీపీ నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేనిచోట్ల పార్టీ నియోజకవర్గం బాధ్యులు సూచించిన పనులు ఇన్చార్జి మంత్రులు మంజూరు చేస్తూ నిధులు దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
నిధులున్నా నిర్లక్ష్యం
Published Tue, Jan 28 2014 2:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement