సాక్షి, రాజమండ్రి : పింఛన్ కావాలంటే ఆధార్ కావాలి.. రేషన్ కార్డు ఉండాలంటే ఆధార్ ఉండి తీరాలి..ఇలా అన్నింటికీ ఆధార్ లంకె పెడుతున్న ప్రభుత్వం ఇపుడు జన్మభూమి గ్రామసభలో ఇచ్చే దరఖాస్తులకు కూడా ఫొటో ఐడెంటిటీ (గుర్తింపు) కార్డు ఉండాలన్న నిబంధన విధించింది. జన్మభూమి సభల్లో నేతల ప్రసంగాలు విని, గంటల తరబడి క్యూల్లో నిలబడి ఎట్టకేలకు అధికారులకు తాము ఆశించే ప్రయోజనానికి అవసరమైన అర్జీ ఇచ్చాం కదా అని నిశ్చింతగా ఉండడం ఇప్పుడు కుదరదు. వాటికిక ఏదైనా గుర్తింపు కార్డు జత చేస్తేనే అవి ఆన్లైన్లో చేరి, అధికారుల పరిశీలనకు నోచుకుంటాయి. లేదం టే చెత్తబుట్ట పాలు కావడం ఖాయం.
వీటి జిరాక్సు కాపీలను జోడించాలి..
ఇల్లు, పింఛను, రేషన్ కార్డు వంటివి మంజూరు చేయాలని కోరే అర్జీలకు తప్పనిసరిగా ఆధార్ కార్డు నకలు జోడించి తీరాలి. ఇతర వ్యక్తిగత అవసరాలకు సంబంధించి ఎటువంటి దరఖాస్తు అయినా అధికారులకు ఇచ్చే సమయంలో తాము ఇచ్చే అర్జీతో ఆధార్ కార్డు, ఓటరు కార్డు లేదంటే రేషను కార్డు జిరాక్సు కాపీ విధిగా జత చేయాలి. అంతే కాకుండా అందుబాటులో ఉండే మొబైల్ ఫోన్ లేదా ల్యాండ్ లైన్ నెంబరు దరఖాస్తుపై తప్పనిసరిగా ఉండాలి. అధికారులకు ఇచ్చే అర్జీ తర్వాత కంప్యూటర్ విభాగానికి వెళుతుంది. అక్కడ అర్జీదారుని గుర్తింపు కార్డు, ఫోన్ నంబరు ప్రధానంగా తీసుకుని ఇతర వివరాలను కంప్యూటర్లో పొందు పరుస్తారు. అవి లేకపోతే ఇచ్చిన దరఖాస్తును చిత్తు కాగితంతో సమానంగా పరిగణిస్తారు.
అన్నీ దాటి, ఆశ నెరవేరేదెన్నడో?
ప్రభుత్వం జన్మభూమిలో అందిన దరఖాస్తులను ముందుగా కంప్యూటరీకరిస్తోంది. అనంతరం మొబైల్ ద్వారా వాటి సమాచారం తెలుసుకునేందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్ఎస్)ను ఏర్పాటు చేయనుంది. జన్మభూమి కార్యక్రమం అనంతరం ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం నుంచి దరఖాస్తుదారునికి ఒక ఫోన్ వస్తుంది. ‘మీరు జన్మ భూమిలో దరఖాస్తు చేసుకున్నారు.. మీ చిరునామా ఇదేనా? దరఖాస్తుదారు నిజంగా మీరేనా?’ వాకబు చేస్తారు. ఈ విధంగా జన్మభూమిలో అందిన దరఖాస్తుల్లో అసలు, నకిలీల నిర్ధారణకు సర్కారు పరీక్షలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. దీనిని బట్టి చేసుకున్న దరఖాస్తు అధికారులు తీసుకోవాలి, వాటిని కంప్యూటరీకరించాలి, అనంతరం ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ రావాలి. ఆ తర్వాతే అర్హమైన వాటి జాబితాలో చేరతాయి. అవి పరిష్కారమై దరఖాస్తుదారుకు ప్రయోజనం దక్కేది ఎప్పుడో సర్కారే చెప్పాలి.
అధికారులకూ చిక్కుసమస్యే..
దరఖాస్తు తీసుకునే సమయంలో కూడా అధికారులు ఫొటో గుర్తింపు పత్రాల నకళ్లు తీసుకోవాలని సూచించింది. కానీ చాలా వరకూ కార్యక్రమాల్లో గుర్తింపు కార్డు జిరాక్సులు లేకపోవడంతో గతంలో ఇచ్చిన దరఖాస్తుల్లో కొన్ని వేల దరఖాస్తులను కంప్యూటరీకరించలేదని తెలుస్తోంది. వీటికి సంబంధించిన గుర్తింపు కార్డులు, ఫోన్ నంబర్లు సేకరించి శుక్రవారం సాయంత్రంలోగా కంప్యూటరీకరించాలని అన్ని మండలాల అధికారులకూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గతంలోని దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికిప్పుడు ఆధారాలు, వివరాలు ఎలా సేకరించాలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
‘గుర్తింపు’ లేకుంటే బుట్టదాఖలే
Published Sat, Nov 8 2014 3:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement