♦ ఉదయం 8.23 గంటలకు ముహూర్తం
♦ తాత్కాలిక సెక్రటేరియెట్ నిర్మాణానికి అధిక మొత్తం టెండర్లకు కేబినెట్ ఆమోద ముద్ర
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి అంచనా వ్యయాన్ని 12 శాతానికి పెంచి, టెండర్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఎక్సెస్ టెండర్లకు ఆమోదముద్ర వేసిన మరుక్షణమే శంకుస్థాపన నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నెల 17వ తేదీన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. సీఎం అధ్యక్షతన విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మంత్రులు పల్లె రఘునాథ్రెడ్డి, నారాయణ మీడియాకు వివరించారు.
► తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణాన్ని ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలకు అప్పగించాలని నిర్ణయం. చదరపు అడుగుకు రూ.3,350 చొప్పున నిర్మాణ పనులు ఆ కంపెనీలకు అప్పగింత. 12 శాతం అదనంగా రూ.180 కోట్ల అంచనా వ్యయం రూ.201 కోట్లకు పెంపు.
► ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు భవనాల నిర్మాణం జూన్ 15లోగా పూర్తయ్యేలా చర్యలు. ఈ భవనాల నిర్మాణానికి ఈ నెల 17వ తేదీ ఉదయం 8 గంటల 23 నిమిషాలకు శంకుస్థాపన. తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ ప్రాంతాలకు రూ.60 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.25 కోట్లు మంజూరు.
► సియాచిన్లో మృతి చెందిన వీర జవాను ముస్తాక్ అహ్మద్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం. అతడి కుటుంబంలో అర్హులైన ఒకరికి ఉద్యోగం.
► ఇబ్బందుల్లో ఉన్న 35 ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో రాయితీ. ఒక్కో యూనిట్కు రూ.1.50 పైసలు రిబేట్ ఇవ్వడానికి అంగీకారం. + అవయవ దానాలను ప్రోత్సహించేందుకు ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిష్ట్రేషన్ చట్ట సవరణకు నిర్ణయం.+ క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.500 కంటే ఎక్కువకు కోట్ చేసిన టెండర్లన్నీ రద్దు. వీటన్నింటికీ మళ్లీ షార్ట్ టెండర్లు పిలిచి అవి ఖరారయ్యే వరకూ డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుక తవ్వకాలకు అనుమతి. + తూర్పుగోదావరి జిల్లా ఏటిపాక, పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, అందుకవసరమైన 44 పోస్టుల మంజూరు.
►కర్నూలు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో వివిధ అవసరాలకు ప్రభుత్వ భూముల కేటాయింపు.
17న సచివాలయానికి శంకుస్థాపన
Published Tue, Feb 16 2016 2:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
KKR vs LSG: విజయం ఎవరిని వరిస్తుంది?
CSK vs PBKS: గెలుపు ఎవరిదో?
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
ఇంకా తగ్గని లేఆప్స్ బెడద.. నాలుగు నెలల్లో 80 వేలమంది
లోకేష్ ఎంట్రీతోనే హత్యా రాజకీయాలు: నందమూరి లక్ష్మీపార్వతి
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ
ఓటీటీలో హీరామండి.. స్టార్ డైరెక్టర్ మేనకోడలిపై విమర్శలు!
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement