డీసీసీ అధ్యక్షుడి వాహనంపై దాడి
కారు అద్దాలు ధ్వంసం
చిత్తూరు (అర్బన్): చిత్తూరులో తెలుగుదేశం నేతలు కొందరు సోమవారం కాంగ్రెస్ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. చంద్రబాబు హామీలు నెరవేర్చలేదని నిరసన తెలియజేస్తున్నవారిని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి వాహనాన్ని ధ్వంసం చేశారు. సీఎంగా ఏడాది కాలం పూర్తయినా చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిరసన తెలియజేయడానికి సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. గాంధీ విగ్రహానికి వేసి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేయడానికి సన్నద్ధమయ్యారు.
ఇంతలో వన్టౌన్ పోలీసు స్టేషన్లో కేసీఆర్పై ఫిర్యాదు చేసి వస్తున్న టీడీపీ నాయకులు వీరిని చూశారు. కొందరు బడా నాయకులు కాంగ్రెస్ పార్టీ నిరసనను అడ్డుకోమని చెప్పి ఆజ్యం పోసి వెళ్లిపోయారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక్కడుంటే పింఛన్లు ఇవ్వబోమని, బ్యాంకు రుణాల్లో కోతలు విధిస్తామని చెప్పి మహిళలను అక్కడి నుంచి తరిమేశారు.
సోనియా గాంధీ వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని, చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజలకు అన్నీ మేలు జరుగుతుంటే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటోందని మండిపడ్డారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ నాయకుల వెంటపడ్డారు. తాము నిరసన వ్యక్తం చేృుడానికి పోలీసుల అనుమతి ఉందని చెబుతున్నా టీడీపీ నాయకులు పట్టించుకోలేదు. కాంగ్రెస్ నాయకులు వాహనంలో వెళుతుండగా వెంబడించి నడిరృడ్డుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో డీసీసీ అధ్యక్షుడి కారుకు రెండువైపులా అద్దాలు ధ్వంసమయ్యాయి. కారులో ఉన్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. జిల్లా కలెక్టర్, వన్టౌన్ పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.
పోలీసుల ప్రేక్షక పాత్ర
కాంగ్రెస్ నాయకులపై టీడీపీ నాయకు ల దౌర్జన్యానికి పాల్పడగా, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసనకు పోలీసులు ముందస్తుగా అనుమతి ఇచ్చారు. అయితే వీరిని టీడీపీ నాయకులు అడ్డుకుంటుండగా పోలీసులు పట్టించుకోలేదు. ఒక దశలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెండు చేతులు జోడించి తమ నిరసనకు అడ్డురావద్దని టీడీపీ నాయకులను వేడుకున్నారు. అయినా సరే దీనికి అధికారపార్టీ నాయకులు అంగీకరించకపోవడంతో భయంతో వెనుదిగారు. పోలీసులే అక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులను వాహనం ఎ క్కించి పంపేశారు. పోలీసుల తీరుపై, టీడీపీ నాయకుల వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
కాంగ్రెస్ నేతలపై టీడీపీ దౌర్జన్యం
Published Tue, Jun 9 2015 5:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement