కరీంనగర్ సిటీ, న్యూస్లైన్: కాంగ్రెస్ కృతజ్ఞతా సభకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. పార్టీ వ్యవస్థాపక దినమైన ఈనెల 28న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలుపడం, అసెంబ్లీకి ముసాయిదా బిల్లు రావడానికి కారణమైన యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, రాహుల్గాంధీలకు ఈ సభ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతామన్నారు.
శనివారం ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినం సందర్భంగా 28న అన్ని గ్రామాల్లో, వార్డుల్లో పార్టీ జెండావిష్కరణ చేపట్టాలని, మధ్యాహ్నం ఒంటిగంటకు కృతజ్ఞతా సభకు పార్టీ నాయకులు, శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కులసంఘాలు, తెలంగాణ సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, తెలంగాణ రాష్ట్ర సాధనకు వివిధ రూపాల్లో పోరాటం చేసిన ప్రతి ఒక్కరినీ సభకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ ఇప్పటికే మొదలైందని పునరుద్ఘాటించారు. జనవరి 3 నుంచి సమావేశాలు అని వెలువడిన బులిటెన్లోనే చర్చ మొదలైందని స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు.
డీసీసీ కార్యాలయంలో
సన్నాహక సమావేశం
కృతజ్ఞతా సభ విజయవంతానికి శనివారం డీసీసీ కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులతో మంత్రి శ్రీధర్బాబు భేటీ అయ్యారు. కనీసం లక్ష మందికి తగ్గకుండా జనసమీకరణ చేయాలన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా సభలు నిర్వహించాలని అనుకున్నా, గతంలో వాయిదా వేసినందున ముందుగా జిల్లా కేంద్రంలో కృతజ్ఞతా సభను నిర్వహించడానికే నాయికులు మొగ్గుచూపారు.
ఆ తరువాత నియోజకవర్గాల వారీగా సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సమావేశంలో ఎంపీ పొన్నం ప్రభాకర్, విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీ టి.సంతోష్కుమార్, ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, డీసీసీ అధ్యక్షుడు కొండూరు రవీందర్రావు, మత్సపారిశ్రామిక సంస్థ చైర్మన్ చేతి ధర్మయ్య, వేములవాడ దేవస్థానం చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్, నగర అధ్యక్షుడు కన్న కృష్ణ, పీసీసీ ప్రధానకార్యదర్శి కోలేటి దామోదర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పనకంటి చంద్రశేఖర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డెరైక్టర్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, మాజీ మేయర్ డి.శంకర్, పీసీసీ కార్యదర్శులు వై.సునీల్రావు, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, నేరెళ్ల శారద, అర్బన్బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆమ ఆనంద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గుగ్గిళ్ల జయశ్రీ, నందెల్లి రమ, ఎస్సీసెల్ జిల్లా చైర్మన్ అర్ష మల్లేశం, వి.అంజన్కుమార్ పాల్గొన్నారు.
28న కాంగ్రెస్ కృతజ్ఞతా సభ
Published Sun, Dec 22 2013 4:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
అంతా బాబే చేశారు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement