బైక్, టిప్పర్ ఢీ | Sakshi
Sakshi News home page

బైక్, టిప్పర్ ఢీ

Published Sat, Apr 11 2015 11:27 AM

one dies in bike, tipper accident

కర్నూలు: వేగంగా వెళ్తున్న టిప్పర్, బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో జరిగింది. వివరాలు.. వెల్దుర్తి మండలం ఎల్.కొట్టాల గ్రామానికి చెందిన లక్ష్మిరెడ్డి (27) మద్దిలేటి స్వామి ఆలయానికి వెళ్తున్నాడు.


ఈ క్రమంలో డోన్ నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ వాహనం మద్దిలేటి బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(బేతంచర్ల)

Advertisement
Advertisement