స్కూల్ బస్సును ఢీకొని యువకుడు మృతి | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సును ఢీకొని యువకుడు మృతి

Published Tue, Jan 5 2016 5:54 PM

One dies in Road accident

బత్తలపల్లె (అనంతపురం) : మలుపు తిరుగుతున్న బస్సును వెనుక నుంచి బైక్‌తో ఢీకొట్టి ఓ యువకుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా బత్తలపల్లె మండలం రాఘవంపల్లె గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు నగరం భరత్‌నగర్‌కు చెందిన ప్రమోద్(25) మంగళవారం సాయంత్రం తన బైక్‌పై వెళ్తూ మలుపు తిరుగుతున్న ప్రైవేట్ స్కూలు బస్సును వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ప్రమోద్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఎస్సై హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement