ఆదుకుంటాడనుకుంటే.. | Sakshi
Sakshi News home page

ఆదుకుంటాడనుకుంటే..

Published Sun, Nov 16 2014 3:00 AM

ఆదుకుంటాడనుకుంటే.. - Sakshi

 మక్కువ:  ఒక్కగానొక్క కొడుకు  చివరి కాలంలో తమను ఆదుకుంటాడనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు రోడ్డు ప్రమాదం రూపంలో నేలకూలాయి. మండలంలోని మేలాపువలస గ్రామానికి చెందిన వెన్నల శ్రీనివాస్(22) అనే యువకుడు హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృ తి చెందాడు. కాకినాడలో ఎంటెక్ కరస్పాండెంట్ రెండో సంవత్సరం కోర్సుచేస్తూ, మరో పక్క హైద్రాబాద్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నంచేస్తూ కొంతకాలంగా స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో ఓ ఉద్యోగంలో చేరారు. శుక్రవారం ఉదయం ఎల్లారెడ్డిగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లి  స్నేహితులును కలిసి తిరిగి రూమ్‌కు వచ్చేందుకు రన్నింగ్‌లో బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి బస్సు కిందపడి మృతిచెందాడు.
 
 శ్రీనివాస్‌ను మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులతో పాటు, బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. తండ్రి జగన్నాథం ఇళ్లనిర్మాణ పనులు చేయిస్తూ కొడుకు, కూతురును  ఉన్నతచదువులు చదివించాడు. ఒక్కగానొక్క కొడుకు దుర్మరణం చెందడంతో తల్లిదండ్రుల రోదన వర్ణణాతీతం. శ్రీనివాస్ మృతదేహాన్ని శనివారం ఉదయం మేలాపువలసకు తల్లిదండ్రు లు  ఆవేదనతో కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదన ఎవరికీ ఆపతరం కాలేదు. శ్రీనివాస్ సుదూర ప్రాంతంలో చదువుతున్నప్పటికీ గ్రామానికి వచ్చినప్పుడు అందరితో కలుపుగోలుగా ఉండడంతో అతను మృతిచెందిన విషయాన్ని స్థానికులు, బంధువులు తట్టుకోలేకపోతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement